‘మిస్టర్ మజ్ను’ ప్రమోషన్లు షురూ!

  • December 14, 2018 / 12:43 PM IST

అఖిల్ హీరోగా నిధి అగర్వాల్ హీరోయిన్ గా తెరకెక్కుతున్న తాజా చిత్రం ‘మిస్టర్ మజ్ను’. వరుణ్ తేజ్ తో ‘తొలిప్రేమ’ లాంటి సూపర్ హిట్ చిత్రాన్ని తెరకెక్కించిన వెంకీ అట్లూరి దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతుంది. అఖిల్ 3 వ చిత్రంగా తెరకెక్కుతోన్న ఈ చిత్రాన్ని ‘ఎస్.వి.సి.సి’ ఎంటర్టైన్మెంట్స్ పతాకం పై బి.వి.ఎస్.ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్నారు.

తమన్ సంగీతంలో తెరకెక్కుతోన్న ఈ చిత్రం నుండీ ఫస్ట్ సింగల్ అయిన ‘ఏమైనదో’ అంటూ సాగే పాటను డిసెంబర్ 14 న (రేపు) ఉదయం 9 గంటలకు విడుదల చేయబోతున్నారు. అలాగే ఈ చిత్ర సెకండ్ టీజర్ ను డిసెంబర్ 25 న విడుదల చేయబోతున్నారు. ఇక రిపబ్లిక్ డే కానుకగా జనవరి 25 న చిత్రాన్ని విడుదల చేయబోతున్నట్టు ఇప్పటికే చిత్ర యూనిట్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ చిత్రంతో ఎలాగైనా హిట్టు కొట్టాలని అఖిల్ ప్రయత్నిస్తున్నట్టు ఫిలింనగర్ విశ్లేషకులు చెప్పుకొస్తున్నారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus