ఎరోటిక్ సినిమాతో ఎమ్మెస్ రాజు రీ ఎంట్రీ..!

  • November 22, 2016 / 12:56 PM IST

వెంకటేశ్ హీరోగా వచ్చిన ‘శత్రువు’ సినిమా నేటి తరానికి అంతగా తెలీకపోవచ్చు గానీ ‘దేవి’, ‘ఒక్కడు’, ‘వర్షం’, ‘నువ్వేస్తానంటే నేనొద్దంటానా’ వంటి సినిమాలనైతే ఠక్కున పట్టేస్తారు. ఈ సినిమాలన్నిటికి వెన్నెముక లాంటి వ్యక్తి ఎమ్మెస్ రాజు. ఇలా వరుస విజయాలతో దూసుకొచ్చిన ఈ నిర్మాతని తర్వాతి కాలంలో ‘ఆట’, ‘వాన’ వంటి అపజయాలు కూడా చుట్టుముట్టాయి. పలు కష్టనష్టాల కోర్చి తనయుడిని తెలుగు చిత్రసీమకు పరిచయం చేసిన ‘తూనీగ తూనీగ’ రాజుగారి చివరి చిత్రం. ఆయన సినిమాల వరస చూస్తే కమర్షియల్ ప్రమాణాలు పాటిస్తూనే విలువలు ఉన్న నిర్మాత అన్నది బోధపడుతుంది. ఆ లక్షణం ఇప్పుడు దిల్ రాజు లోను కొంతవరకు కనపడుతుంది.

ఆమాటకొస్తే దిల్ రాజు కూడా ఎమ్మెస్ రాజు అభిమానే. అలాంటి నిర్మాత ఇప్పుడు ఓ శృంగార భరిత చిత్రంతో మళ్ళీ సినిమా చేస్తుండటం అంతటా చర్చనీయం అయ్యింది. ‘రతి’ పేరుతో ఎమ్మెస్ రాజు స్వీయ దర్శకత్వంలో రూపొందనున్న ఈ సినిమా ఫిబ్రవరిలో సెట్స్ మీదికి వెళ్లనుంది. ఈ సినిమా తెలుగు తోపాటు తమిళం, మలయాళం, కన్నడ, హిందీ, మరాఠీ భాషల్లో తెరకెక్కనుండటం విశేషం. పోతే.. ఈ కథని సుమంత్ ఆశ్విన్ కోసం ఓ లఘు చిత్ర దర్శకుడు తీసుకొస్తే అది కాస్త ఎమ్మెస్ రాజు సొంతం చేసుకున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇందులో ఎంత నిజముందో మరి..? వీటన్నిటికీ మించి రచయితగా, నిర్మాతగా భారీ విజయాలను చవి చూసిన రాజు గారు దర్శకుడిగా గట్టి దెబ్బలే తిన్నారు. ఇన్నేళ్ల తర్వాత చేస్తున్న ఈ సినిమా ఆయనకీ ఎలాంటి ఫలితాన్నిస్తుందన్నదీ ఆసక్తికరమే..!

Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus