సమంత గురించి మురళీమోహన్ కామెంట్స్…!

  • April 17, 2020 / 08:21 PM IST

సీనియర్ నటుడు మురళీ మోహన్ … ఇప్పుడున్న ఇండస్ట్రీ పెద్దలలో ఒకరు. ఒకప్పుడు ఆయనకి సినీ ఇండస్ట్రీ పై గట్టి పట్టు ఉంది. అప్పట్లో ఎన్నో హిట్ చిత్రాలలో నటించిన ఈయన ఇప్పుడు పెద్దగా సినిమాలలో కనిపించడం లేదు. ప్రేక్షకుల్ని ఇట్టే ఆకట్టుకునే వాక్చాతుర్యం కలిగిన ఈ సీనియర్ తాజాగా నాగ చైతన్య, సమంతల గురించి కొన్ని ఆసక్తికరమైన కామెంట్స్ చేసి వార్తల్లో నిలిచారు. ఈయనకు హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తారన్న సంగతి తెలిసిందే.

‘జయభేరి’ అనే సంస్థ ఈయనదే… ఈయనకు చాలా భూములు – వెంచర్లు కూడా ఉన్నాయి. ఇటీవల హైదరాబాద్ లోని ఓ ఏరియాలో 14వ అంతస్థులో స్విమ్మింగ్ ఫూల్ – జిమ్ తోపాటు అన్ని సౌకర్యాలతో మూడు ఇల్లులని కట్టించుకున్నాడు. అయితే నాగచైతన్యకు ఆ ఇల్లు నచ్చడంతో… తనకు అమ్మమని మురళీ మోహన్ ను అడిగాడట. అందుకు ఆయన ఒప్పుకోలేదట. ఎంతో ఇష్టపడిన కట్టించుకున్న ఇల్లు కాబట్టి మురళీ మోహన్ అలా చెప్పారట.

అయితే నాగార్జున ఫోన్ చేసి రిక్వెస్ట్ చేయడంతో చైతన్య కు ఇల్లు అమ్మారట. మురళీ మోహన్ మాట్లాడుతూ…”పక్కపక్క ఇళ్లలో ఉండడం వల్ల మేము… నాగచైతన్య-సమంతలను తరచూ కలిసే వాళ్ళం.కాసేపు కబుర్లు కూడా చెప్పుకునే వాళ్ళం. అయితే ఒకరోజు జిమ్ చేయడానికి వెళ్తే.. అక్కడికి సమంత కూడా వచ్చింది. చాలా ఉన్న సమంత ఆ బరువులు ఎత్తేస్తుంటే చూసి ఒక్కసారిగా షాకయ్యాను. ఆమె చాలా డెడికేషన్ అండ్ ప్రొఫెషనల్ అమ్మాయి. అన్ని వర్కౌట్ లు ఎవ్వరూ చేయలేరు” సమంత గురించి చెప్పుకొచ్చారు మురళీ మోహన్.

Most Recommended Video

అత్యధిక టి.ఆర్.పి నమోదు చేసిన సినిమాల లిస్టు!
టాలీవుడ్ టాప్ హీరోల వరస్ట్ లుక్స్ ఇవే!
మన హీరోయిన్ల ఫ్యామిలీస్ సంబంధించి రేర్ పిక్స్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus