మురుగదాస్ దర్శకత్వంలో నటించనున్న పవన్ కళ్యాణ్!

  • September 20, 2017 / 08:12 AM IST

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో నటిస్తున్నారు. అజ్ఞాతవాసి అనే టైటిల్ పరిశీలిస్తున్న ఈ సినిమా సంక్రాంతికి రిలీజ్ కానుంది. దీని తర్వాత పవన్ తమిళ దర్శకుడు ఆర్ టీ నేసన్,  సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలో సినిమా చేయాలి. కానీ వాటిని పక్కనపెట్టి ప్రత్యక్ష రాజకీయాల్లో బిజీకానున్నారు. అయితే ఎన్నికల తర్వాత పవన్ ఖైదీ నంబర్ 150 సీక్వెల్ ల్లో నటిస్తారని ఫిలిం నగర్ వాసులు చెబుతున్నారు. ఈ వార్త ప్రచారం కావడానికి కారణం లేకపోలేదు. స్పైడర్ సినిమా ప్రచారంలో పాల్గొన్న మురుగదాస్ కొన్ని ఆసక్తికర సంగతులు వెల్లడించారు. “పవన్ తో ఎప్పుడో సినిమా చేయాల్సింది.

గజని సినిమా కథ కూడా ఆయనకు వినిపించాను. ఆయన ఒప్పుకోలేదు. తర్వాత కత్తి  సినిమా చూసి నన్ను అభినందించారు. ఇంకా ఆ కథను పొడిగిస్తే బాగుంటుందని చెప్పారు.” అని వివరించారు. కత్తి సీక్వెల్ కథను సిద్ధం చేయనున్నట్లు మురుగదాస్ చెప్పారు. అయితే ఆ కథను తప్పకుండా పవన్ ఒకే చేస్తారని అభిమానులు భావిస్తున్నారు. కత్తి కథ  ఖైదీ నంబర్ 150  గా చిరంజీవి రీమేక్ చేయగా.. కత్తి 2 ని డైరక్ట్ గా పవన్ కళ్యాణ్ చేయనున్నారన్నమాట. మరి ఇది ఏకకాలంలో తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కుతుందో, లేదో ఇప్పుడే చెప్పలేము.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus