Akhil: అఖిల్‌కి అడ్వాన్స్‌ తీసుకునేంత రేంజ్‌ వచ్చిందా?

  • June 15, 2021 / 11:57 AM IST

స్టార్‌ హీరోలతో సినిమాలు చేసే మైత్రి మూవీ మేకర్స్‌, కాస్త ప్రామిసింగ్‌ కనిపించే యంగ్‌ హీరోలను కూడా వదలదు. వెంటనే అడ్వాన్స్‌ ఇచ్చి లాక్‌ చేసేస్తుంది. అలా తాజాగా మైత్రి టీమ్‌ అఖిల్‌కు అడ్వాన్స్‌ ఇచ్చిందని టాక్‌. దీంతో మైత్రి ఏ స్ట్రాటజీతో అఖిల్‌కు అడ్వాన్స్‌ ఇచ్చింది అనే చర్చ టాలీవుడ్‌లో మొదలైంది. ఇప్పటివరకు అఖిల్‌ రీ ఎంట్రీలకే సరిపోయింది. ఎన్ని సినిమాలు చేసినా విజయం దక్కడం లేదు. ఈ క్రమంలో ఏ ధైర్యంతో సినిమా చేస్తున్నారో.

అఖిల్‌.. ‘అఖిల్‌’తో ఎంట్రీ ఇచ్చి దుమ్మురేపుదాం అనుకున్నాడు. కానీ సీన్‌ రివర్స్‌ అయ్యింది. దీంతో వరుసగా రీఎంట్రీలు ఇస్తూ వచ్చాడు. తాజాగా ‘మోస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌’తో సిద్ధంగా ఉన్నాడు. ఇది ఎప్పుడు రిలీజ్‌ అవుతుందనేది ఎవరికీ తెలియని పరిస్థితి. దీన్ని పక్కనపెడితే సురేందర్‌ రెడ్డి దర్శకత్వంలో ‘ఏజెంట్‌’ చేయబోతున్నాడు. ఆ తర్వాత మైత్రి సినిమా ఉంటుందట. అఖిల్‌ – మైత్రి సినిమాకు దర్శకుడు ఎవరు అనేది ఇంకా తెలియడం లేదు.

పెద్ద దర్శకుడితో చేస్తారా, లేక కుర్ర దర్శకుడికి ఓటేస్తారా? అనేది త్వరలో క్లారిటీ వస్తుంది. అయితే అసలు మైత్రి.. అఖిల్‌ను ఎందుకు ఎంచుకుంది అనే క్లారిటీ ముందు రావాలి. ఈ కాంబినేషన్‌ వెనుక నమ్మకం ఉందా? నాగార్జున ఉన్నారా? అనేదే ఇక్కడొస్తున్న డౌట్‌. ఎవరుంటే ఏముంది… అఖిల్‌ హిట్‌ కొట్టి ‘అఖిలే నం.1’ అనిపించుకుంటే అదే పదివేలు. అంతేనా!

Most Recommended Video

ఈ 10 మంది టాప్ డైరెక్టర్లు తెలంగాణ రాష్ట్రానికి చెందిన వాళ్ళే..!
2 ఏళ్ళుగా ఈ 10 మంది డైరెక్టర్ల నుండీ సినిమాలు రాలేదట..!
టాలీవుడ్లో రూపొందుతున్న 10 సీక్వెల్స్ లిస్ట్..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus