ఎంతమంది ఉన్నారన్నది కాదు.. ఎవడున్నాడన్నది ముఖ్యం : నాగ బాబు

  • December 10, 2019 / 12:53 PM IST

బుల్లితెర పై ‘జబర్దస్త్’ కామెడీ షో ఎంత సెన్సేషన్ క్రియేట్ చేస్తూ వచ్చిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ షో వల్ల కామెడీ సినిమాలకు జనం మొహం చాటేసేంతలా ఈ షో పాపులర్ అయ్యింది. ఇక ఈ షోలోని చాలా మంది ఆర్టిస్ట్ లు సినిమాల్లో కూడా అవకాశాలు దక్కించుకుంటూ వచ్చారు. అయితే అనూహ్యంగా ఈ షో నుండీ జడ్జి నాగబాబు తప్పుకోవడం.. ఆ తరువాత కొంతమంది టీమ్ లీడర్లు.. టీం మెంబర్స్ కూడా తప్పుకుంటున్నారంటూ వార్తలు కూడా వచ్చాయి. వాళ్ళలో చాలా మంది వేరే ఛానల్ లో కూడా కనిపిస్తున్నారు.

కానీ నాగబాబు కోసమే వారు బయటకి వచ్చేసారు.. అనుకుంటున్న తరుణంలో.. ఇప్పుడు వేరే షో లలో కనిపిస్తూ ఉండడంతో.. అందరూ ఆశ్చర్యపోతున్నారు. దాదాపు వారు నాగబాబుకు హ్యాండ్ ఇచ్చినట్టే అనే టాక్ ఫిలింనగర్లో బలంగా వినిపిస్తుంది. ఇదిలా ఉండగా.. ‘అదిరింది.. మాటల్లేవ్.. మాట్లాడుకోడాల్లేవ్’ అనే షో కు నాగబాబు జడ్జ్ గా వ్యహరించబోతున్నాడు. ఈ క్రమంలో విడుదల చేసిన ప్రోమోలో ‘ఎంతమంది ఉన్నారన్నది కాదురా .. ఎవడున్నాడన్నది ముఖ్యం’ అంటూ .. నాగబాబు చెప్పిన డైలాగ్ నిజనేనని స్పష్టం చేసిందని కొందరు కామెంట్స్ చేస్తున్నారు. మరి ఈ వార్తల్లో ఎంత వరకూ నిజముందో తెలియాలంటే.. నాగ బాబు తన యూట్యూబ్ ఛానెల్ లో మరో వీడియో పోస్ట్ చేయాల్సిందే.


24 గంటల్లో హైయెస్ట్ వ్యూస్ అండ్ లైక్స్ సాధించిన లిరికల్ సాంగ్స్ ఇవే!
30 సౌత్ ఇండియన్ హీరోయిన్లు మరియు వారి చైల్డ్ హుడ్ పిక్స్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus