అఖిల్ నిక్షితార్ధ వేడుకలో స్పెషల్ ఎట్రాక్షన్ గా చైతూ, సమంతలు
December 10, 2016 / 11:21 AM IST
|Follow Us
కింగ్ అక్కినేని నాగార్జున, అమల కుమారుడు అఖిల్ నిశ్చితార్థం శ్రీయా భూపాల్తో హైదరాబాద్లోని ఓ ప్రైవేటు అతిథిగృహంలో శుక్రవారం వైభవంగా జరిగింది. ప్రముఖ వ్యాపారవేత్త జీవీకే మనవరాలైన శ్రీయా భూపాల్, అఖిల్లు గతకొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. మూడు నెలల క్రితం పెద్దలను ఒప్పించి, వారి ఆశీర్వాదంతో ఇప్పుడు బంధు మిత్రుల సమక్షంలో ఉంగరాలు మార్చుకున్నారు. వైభవంగా జరిగిన ఈ వేడుకలో నాగ్ పెద్దకొడుకు నాగచైతన్య , సమంత లు స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచారు.
చైతూ తెలుపు షేర్వాణీలో మెరిసిపోతే, స్యామ్ పొడుగు జాకెట్ , చీరలో వచ్చి అందరి దృష్టిని ఆకర్షించింది. కార్యక్రమాన్ని హాజరైనవారు అఖిల్, శ్రీయాల జంట కంటే నాగ చైతన్య, సమంతల గురించే ఎక్కువగా మాట్లాడుకున్నారు. వారు పెళ్లి ఎప్పుడు చేసుకుంటారని ప్రశ్నించుకున్నారు. అఖిల్ పెళ్లి వేడుక ముగిసిన వెంటనే చైతూ పెళ్లి పనుల్లో నాగార్జున బిజీ కానున్నట్లు తెలిసింది. ముందు హిందూ సంప్రదాయంలో పెళ్లి చేసుకొని, ఆ తర్వాత చర్చిలో ఈ ప్రేమ పక్షులు ఉంగరాలు మార్చుకోనున్నట్లు సమాచారం.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.