నాగ చైతన్య.. ఆ డైరెక్టర్ ను పక్కన పెట్టేసాడా?

  • May 7, 2020 / 07:36 PM IST

‘మజిలీ’ ‘వెంకీ మామ’ వంటి చిత్రాలతో హిట్లు కొట్టి మంచి ఫామ్ లో ఉన్నాడు నాగ చైతన్య. ఇప్పుడు శేఖర్ కమ్ముల డైరెక్షన్లో ‘లవ్ స్టోరీ’ అనే చిత్రం చేస్తున్నాడు. సాయి పల్లవి ఈ చిత్రంలో హీరోయిన్ గా నటిస్తుంది. లాక్ డౌన్ వల్ల ఈ చిత్రం షూటింగ్ ఆగిపోయింది. ఇప్పటికే విడుదల చేసిన వీడియో ప్రోమో స్ అలాగే ఫస్ట్ సింగిల్ కు మంచి స్పందన లభించడంతో సినిమా పై అంచనాలు పెరిగాయి. ఈ చిత్రంతో చైతన్య ఎలాగైనా హిట్టు కొట్టి హ్యాట్రిక్ కొడతాడు అని ఆయన అభిమానులు కూడా ఎంతో ఆశగా ఉన్నారు.

ఇక ఈ చిత్రం తర్వాత… ‘గీత గోవిందం’ దర్శకుడు పరశురామ్ తో ఓ చిత్రం చెయ్యాల్సి ఉంది. కానీ ప్రాజెక్ట్ ప్రస్తుతం హోల్డ్ లో పడింది. మరోపక్క .. ‘ఓ బేబీ’ తో సమంతకు ఓ బ్లాక్ బస్టర్ ఇచ్చిన నందినీ రెడ్డి… చైతన్య కోసం ఓ కథను రెడీ చేసి సమంత రిఫరెన్స్ తో .. అతనికి వినిపించిందట. అప్పుడు ఓకే చెప్పిన చైతూ.. ఇప్పుడు విక్రమ్ కుమార్ తో ‘థాంక్యూ’ అనే చిత్రం చెయ్యడానికి రెడీ అవుతున్నాడు. పోనీ ఆ చిత్రం తర్వాత అయినా నందినీ రెడ్డి..

సినిమా ఉంటుందని అనుకుంటే… ఇప్పుడు మరో డైరెక్టర్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని తెలుస్తుంది. నాని, సుధీర్ బాబు లతో ‘వి’ అనే థ్రిల్లర్ ను తెరకెక్కిస్తున్న ఇంద్రగంటి మోహన్ కృష్ణ డైరెక్షన్లో నాగ చైతన్య ఓ చిత్రం చెయ్యడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు. ఇందుకు గాను ఇంద్రగంటి ఓ కథ వినిపించగా… చైతూ ఓకే చేసేసినట్టు కూడా తెలుస్తుంది. అయితే నందినీ రెడ్డి చిత్రాన్ని … కూడా చేస్తాను అనే చెబుతున్నాడట. బహుసా ఈ రెండు చిత్రాలు పూర్తయ్యాక ఆమె స్క్రిప్ట్ ను సెట్స్ పైకి తీసుకెళ్తాడేమో.

Most Recommended Video

అమృతారామమ్ సినిమా రివ్యూ & రేటింగ్!
‘బాహుబలి’ ని ముందుగా ప్రభాస్ కోసం అనుకోలేదట…!
తండ్రికి తగ్గ తనయలు అనిపిస్తున్న డైరెక్టర్స్ కూతుళ్లు

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus