చైతూ నిర్మాత అంత సాహసం ఎందుకు చేశారు ?

  • August 11, 2016 / 11:49 AM IST

యువ సామ్రాట్‌ నాగచైతన్య ‘సాహసం శ్వాసగా సాగిపో’ చిత్రం గురించి ఆసక్తికర వార్త ఫిలిం నగర్లో చక్కర్లు కొడుతోంది. ఈ సినిమా కోసం చైతూ నిర్మాత పెద్ద సాహసమే చేసినట్లు తెలుస్తోంది. ఏమాయ చేసావె’ చిత్రం తర్వాత  డైరెక్టర్‌ గౌతమ్‌ వాసుదేవ మీనన్‌ తో చేసిన ఈ చిత్రానికి భారీ బడ్జెక్ట్ అయిందంట.15 కోట్లు అనుకుని మొదలు పెట్టిన ఈ సినిమా పూర్తి అయ్యేసరికి 22 కోట్లు అయిందని టాక్. ప్రముఖ రచయిత కోన వెంకట్‌ సమర్పణలో ద్వారకా క్రియేషన్స్‌ బేనర్‌పై మిర్యాల రవీందర్‌రెడ్డి ఈ మూవీని నిర్మించారు.

ఈ సినిమా ప్రచారానికి నిర్మాత మరో రెండు కోట్లు వెచ్చించారని తెలిసింది. ఈ చిత్రం రిలీజ్ అనేక సార్లు వాయిదా పడింది. వాయిదాల వెనుక పెద్ద కారణం ఉంది. సాధారణంగా నాగచైతన్య సినిమాను 10 కోట్లతో పూర్తి చేయాలి. అతని సినిమాలు ఎంత విజయం సాధించినా 20 కోట్ల కంటే ఎక్కువగా వసూల్ చేయడం కష్టం. అలాంటింది ఖర్చే 24 కోట్లు అయితే ఇక లాభం ఎలా వస్తుందని ట్రేడ్ వర్గాల వారు పెదవి విరుస్తున్నారు. సినిమా హిట్ సాధించినా అసలు రావడం కష్టమే అంటున్నారు. ఏమైనా ప్లాప్ టాక్ వస్తే మాత్రం భారీ నష్టాన్ని చూడవలసి వస్తుందని డిస్ట్రిబ్యూటర్లు వెనకడుగు వేస్తున్నారు.

అందుకే నాలుగు నెలలుగా పోస్ట్ ఫోన్ అవుతూ వస్తోంది. నాగచైతన్య ప్రేమమ్ మూవీ విడుదలకు సిద్దమైపోతోంది. ఇక ఆలస్యం చేస్తే లాభం లేదనుకొని నిర్మాత వచ్చేనెల 9 న  ‘సాహసం శ్వాసగా సాగిపో’ సినిమాను రిలీజ్ చేయడానికి ఫిక్స్ అయిపోయారు. సాహసంతో తీసిన ఈ మూవీ ఫలితం ఎలా ఉంటుందోనని అందరూ ఎదురుచూస్తున్నారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus