వేసవి కానుకగా నాగచైతన్య చిత్రం!

  • February 19, 2018 / 06:16 AM IST

ఎన్నో ఆశలు పెట్టుకొన్న “యుద్ధం శరణం” బాక్సాఫీసు వద్ద బొక్కబోర్లా పడడంతో “ప్రేమమ్”తో తనకు సూపర్ హిట్ ఇచ్చిన చందు మొండేటితో కథ సిద్ధం చేయించుకొని మరీ నాగచైతన్య చేస్తున్న తాజా చిత్రం “సవ్యసాచి”. మాధవన్ కీలకపాత్ర పోషిస్తున్న ఈ చిత్రంలో బాలీవుడ్ భామ నిధి అగర్వాల్ కథానాయికగా నటిస్తుండగా.. భూమిక మరో ముఖ్యపాత్రలో కనిపించనుండడం విశేషం. ఈ చిత్రం షూటింగ్ చివరి దశకు చేరుకొంది. ఈ చిత్రంలో నాగచైతన్య ఓ టిపికల్ డిజార్డర్ ఉన్న యువకుడిగా కనిపించనున్నాడు.

అయితే.. ఈ చిత్రాన్ని వేసవి కానుకగా మే 24న విడుదల చేసేందుకు దర్శకనిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రంలో యాక్షన్ కి పెద్ద పీట వేసినట్లు తెలుస్తోంది. అలాగే.. నాగచైతన్య కెరీర్ లో మెమోరబుల్ హిట్ గా ఈ చిత్రం నిలవనుందని చిత్ర యూనిట్ వర్గాల సమాచారం. ఇకపోతే.. నాగచైతన్య ప్రస్తుతం మారుతీ దర్శకత్వంలో తెరకెక్కబోయే “శైలజారెడ్డి అల్లుడు” కోసం రెడీ అవుతున్నాడు. ఈ చిత్రంలో అను ఎమ్మాన్యూల్ కథానాయికగా నటించనుండగా.. సితార ఎంటర్ టైన్మెంట్స్ సంస్థ నిర్మిస్తోంది. ఈ ఏడాది చైతూ నటించిన రెండు సినిమాలు విడుదలవ్వనుండడం విశేషం.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus