Nagarjuna: ఇకపై బిగ్ బాస్ 24 గంటలు చూస్తారు: నాగ్

  • December 24, 2021 / 05:49 PM IST

బిగ్ బాస్ అనగానే చాలా మందికి కాంట్రవర్సీ గొడవలు ఎక్కువగా గుర్తుకు వస్తాయి. అయితే ఈ రోజురోజుకు రియాలిటీ షోకు ప్రేక్షకుల సంఖ్య కూడా ఎక్కువగానే పెరుగుతోంది. గతంలో కొన్ని విమర్శలు వచ్చినప్పటికీ కూడా రేటింగ్స్ అందుకోవడంలో మాత్రం బిగ్ బాస్ ఎప్పటికప్పుడు సరికొత్త రికార్డులను క్రియేట్ చేస్తోంది. కేవలం తెలుగులోనే కాకుండా దేశ వ్యాప్తంగా అత్యధికంగా రెస్పాన్స్ అందుకుంటున్న షోగా బిగ్ బాస్ నికిచినట్లు ఇటీవల నాగార్జున తెలియజేశారు.

హాట్ స్టార్ నిర్వహించిన ప్రత్యేకమైన ప్రోగ్రాం లో నాగార్జున బిగ్ బాస్ ఓటీటీ వెర్షన్ గురించి మరోసారి క్లారిటీ ఇచ్చేశారు. ఇటీవల బిగ్ బాస్ 5వ సీజన్ ను విజయవంతంగా పూర్తి చేసిన నాగార్జున మరో రెండు నెలల్లోనే కొత్త తరహా షోతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు వివరణ ఇచ్చారు. ఇక బిగ్బాస్ నిర్వాహకులు మాత్రం చాలా వేగంగా ఓటీటీ వెర్షన్ ను ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు ప్రయత్నం చేస్తున్నారు.

ఇటీవల మీడియా వేదికగా మాట్లాడిన నాగార్జున త్వరలోనే బిగ్ బాస్ ఓటీటీని మొదలు పెట్టబోతున్నట్లు వివరణ ఇచ్చారు. పూర్తిస్థాయిలో అన్ని రకాల ప్రణాళికలు రచించారని తాను కూడా వ్యాఖ్యాతగా వ్యవహరించబోతున్నట్లు తెలియజేశారు. అయితే టెలివిజన్లో ప్రసారమయ్యే షో కంటే కూడా ఈ ఓటీటీ వెర్షన్ కు చాలా తేడా ఉంటుంది అని నాగార్జున వివరణ ఇచ్చారు. అంతేకాకుండా 24 గంటలు కూడా టెలికాస్ట్ అయ్యే విధంగా హాట్ స్టార్ ప్లాన్ చేసినట్లు తెలియజేశారు.

ఇక కంటెస్టెంట్స్ ఎవరెవరు వస్తారు అనే విషయంలో తను కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నాను నాగార్జున వివరణ ఇచ్చారు. మరి టెలివిజన్ షో తో మంచి రెస్పాన్స్ అందుకున్న నాగార్జున ఈసారి ఓటీటీ వెర్షన్ తో ఏ స్థాయిలో క్రేజ్ అందుకుండాడో చూడాలి. ఇక త్వరలోనే అఫీషియల్ గా మరొక క్లారిటీ ఇవ్వనున్నట్లు సమాచారం. ఇక ఓటీటీ వెర్షన్ లో ఎక్కువగా సోషల్ మీడియాకు చెందిన సెలబ్రిటీలు వచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం.

శ్యామ్ సింగరాయ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

83 సినిమా రివ్యూ & రేటింగ్!
వామ్మో.. తమన్నా ఇన్ని సినిమాల్ని మిస్ చేసుకుండా..!
‘అంతం’ టు ‘సైరా’.. నిరాశపరిచిన బైలింగ్యువల్ సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus