బాహుబలి -2 హక్కుల కోసం నాగార్జున!

  • September 9, 2016 / 09:17 AM IST

దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళిపై కింగ్ నాగార్జున నమ్మకంగా ఉన్నారు. బాహుబలి బిగినింగ్ కంటే కంక్లూజన్ మరింత విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న బాహుబలి -2 వచ్చే ఏడాది ఏప్రిల్ 28 న రిలీజ్ కానుంది. ఈ మూవీపై ఉన్న క్రేజ్ ను దృష్టిలో ఉంచుకొని  హక్కులను సొంతం చేసుకోవడానికి అనేక మంది పోటీపడుతున్నారు. ఈ జాబితాలో టాలీవుడ్ మన్మధుడు కూడా ఉన్నట్లు తెలిసింది.

నిర్మాత సాయి కొర్రపాటితో కలిసి అయన కృష్ణా జిల్లా థియేటర్ హక్కులు కొన్నట్టు సమాచారం. ఇందుకోసం ఏకంగా 8 కోట్లు చెల్లించినట్టు టాక్. గతేడాది విడుదలైన ‘బాహుబలి-1’ కృష్ణా జిల్లాలో 6.8 కోట్లు వసూలు చేసింది. ఆ మొత్తం కంటే 1.2 కోట్లు ఎక్కువగా ఇచ్చి సొంతం చేసుకున్నారంటే బాహుబలి కంక్లూజన్ పై నాగార్జున మీద ఎంత నమ్మకంగా ఉన్నారో అర్థమవుతోంది. నటుడిగానే కాకుండా బిజినెస్ మ్యాన్ గా విజయాలు అందుకున్న నాగార్జున ఒక జిల్లా హక్కులకోసం భారీ మొత్తం చెల్లించేసరికి ఈ సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus