బాహుబలి గురించి వచ్చిన ఆ వార్త లో నిజం లేదు !

  • September 12, 2016 / 11:50 AM IST

కింగ్ అక్కినేని నాగార్జున సినిమా పంపిణీ రంగంలో అడుగు పెట్టారని వస్తున్న వార్తల్లో నిజం లేదని స్పష్టమయింది. బాహుబలి – కంక్లూజన్ థియేటర్ హక్కుల కోసం నాగ్ పోటీ పడుతున్నట్లు వ్యాపించిన రూమర్లు అవాస్తవమని తేలింది. నిర్మాత సాయి కొర్రపాటి తో కలిసి ఆ సినిమా కృష్ణ జిల్లా హక్కులను తాను కొనలేదని కింగ్ వెల్లడించారు.ఆ ఆలోచనే లేదని వివరించారు. పంపిణీ రంగంలో అడుగుపెట్టే ఉద్దేశ్యమే ఎప్పుడూ లేదని నాగ్ మీడియా ప్రతినిధులకు తెలిపారు.

“మీలో ఎవరు కోటీశ్వరుడు” షో నుంచి మాత్రం తప్పుకుంటున్నట్టు ధృవీకరించారు. ఇప్పుడు తాను దర్శకేంద్రుడు కె. రాఘవేంద్ర రావు దర్శకత్వంలో “ఓం నమో వెంకటేశాయ” సినిమా మాత్రమే చేస్తున్నట్లు చెప్పారు. తనయులు నాగ చైతన్య, అఖిల్ ల సినీ కెరీర్ ను గాడిలో పెట్టే వరకు మరే సినిమాకు సంతకం చేసేది లేదన్నారు. వారి కోసమే వచ్చే ఏడాది మొత్తం టైమ్ కేటాయించనున్నట్లు నాగార్జున స్పష్టం చేశారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus