హరికృష్ణ మరణంతో దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన నాగార్జున

  • August 29, 2018 / 06:33 AM IST

టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున జన్మదినం నేడు. కుటుంబసభ్యులతో, అభిమానులతో వైభవంగా జరుపుకోవాలని అనుకుంటుండగా నటుడు, రాజకీయ నేత హరికృష్ణ రోడ్డు ప్రమాదంలో మరణించారని తెలియగానే దిగ్భ్రాంతి చెందారు. “ఇక నాకు అంతా శూన్యంలా ఉంది” అంటూ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఆయనతో తనకున్న అనుబంధాన్ని ట్విటర్ వేదికగా గుర్తుచేసుకున్నారు. “చాలా రోజులు అయ్యింది నిన్ను చూసి, కలవాలి తమ్ముడు.. ఈ మాటలు కొన్ని వారాల క్రితమే ఆయన నాతో చెప్పారు. ఇప్పుడు ఆయన వెళ్లిపోయారు. నాకు అంతా శూన్యంలా ఉంది. ఐ మిస్‌ యూ అన్నా” అని నాగార్జున బాధపడ్డారు.

ఈ సందర్భంగా “సీతారామరాజు” చిత్రంలోని ఓ ఫొటోను పంచుకున్నారు. ‘సీతారామరాజు’ చిత్రంలో హరికృష్ణ, నాగార్జున అన్నదమ్ములుగా నటించిన సంగతి తెలిసిందే. ఎన్టీఆర్, ఏఎన్నార్ ఏ విధంగా కలిసి ఉండేవారో అంతకుమించి నాగ్ .. హరికృష్ణ కలిసి ఉండేవారు. సొంత అన్నలా భావించే హరికృష్ణ మరణాన్ని నాగార్జున జీర్ణించుకులేకపోతున్నారు. అలాగే మోహన్‌బాబు, సుమన్‌, శివాజీరాజా, బాబూమోహన్‌, సుధీర్‌బాబు, అల్లరి నరేశ్‌, సాయి ధరమ్‌ తేజ్‌, గోపీచంద్‌ మలినేని, మంచు లక్ష్మీ, మనోజ్‌, దేవిశ్రీప్రసాద్‌ తదితరులు నందమూరి కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus