అఖిల్ కోసం నాగ్ పక్కా స్కెచ్!!!

  • August 17, 2016 / 09:24 AM IST

టాలీవుడ్ నవ మన్మధుడు నాగార్జున చాలా టెన్షన్ పడుతున్నాడు….తన 30 సంవత్సరాల కెరియర్ లో ఎప్పుడూ పడని టెన్షన్ నాగ్ పడుతున్నట్లు టాలీవుడ్ సర్కిల్స్ లో బలంగా వినిపిస్తుంది. ఇంతకీ నాగ్ ఎందుకు టెన్షన్ పడుతున్నాడు..కారణం ఎవరు అంటే…విషయం ఏమిటంటే…టాలీవుడ్ లో గ్రాండ్ ఎంట్రీ కి ప్లాన్ చేసుకున్న అక్కినేని అఖిల్ తన తొలి సినిమా డిజాస్టర్ కావడంతో ఏం చెయ్యాలో అర్ధం కాక రెండో సినిమా ఇంకా మొదలు పెట్టలేదు.

అయితే తొలి సినిమా రిసల్ట్ ఫోబియాలో ఉన్న అఖిల్ నాగార్జున ఏ కాంబినేషన్ తో మూవీ ప్రాజెక్ట్ ను సెట్ చేసినా ససేమిరా అంటూ ఎదో ఒక కారణం చెపుతూ రెండో సినిమా విషయంలో ఒక క్లారిటీకి రాలేకపోతున్నాడు. తొలుత హాను రాఘవపూడితో ఒక సినిమా అనుకున్నాడు నాగ్, అదే క్రమంలో ఆ ప్రాజెక్ట్ క్యాన్సిల్ అయిన తరువాత దర్శకుడు విక్రమ్  కుమార్ ను రంగంలోకి దింపినా అఖిల్ ఆ కథకు కూడ వంకలు పెట్టడంతో ఇక అఖిల్ కోసం మరో మాస్టర్  స్కెచ్ వేయక తప్పడం లేదు అని ఫిలింనగర్ టాక్. ఇక అఖిల ప్రవర్తనతో విసిగిపొయినా నాగ్ తాజాగా ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తుంది. అదేమిటంటే…అఖిల్ తో తన సూపర్ హిట్ సినిమా ‘మన్మధుడు’ సీక్వెల్ చెయ్యాలి అని.

అయితే దర్శకుల వేటలో ఉన్న నాగ్ కి ఈ కధను త్రివిక్రమ్ అయితే బాగా హ్యాండల్ చెయ్యగలడు అని అనిపించింది కానీ, త్రివిక్రమ్ ఇప్పుడు చాలా బిజీగా ఉన్నాడు…పవన్‌ తో కమిట్ అయిన సినిమాకు కథను తయారు చేయడానికి త్రివిక్రమ్ విపరీతమైన కసరత్తులు చేస్తున్నాడు.   మహేష్‌ అల్లు అర్జున్‌ ఇలా చాలామంది టాప్ హీరోలు త్రివిక్రమ్‌ కోసం ఎదురు చూస్తున్నారు. మరి ఇలాంటి సమయంలో త్రివిక్రమ్ నాగ్ కి ఓకీ చెప్తాడా అంటే డౌట్ అనే చెప్పాలి…కానీ ఇక్కడ కాస్త ఊరటనిచ్చే విషయం ఏమిటంటే…త్రివిక్రమ్ పవన్ కోసం వ్రాస్తున్న స్క్రిప్ట్ విషయంలో ఇంకా పూర్తిగా ఫైనల్ కాని నేపధ్యంలో ఏమైనా ఈ ప్రాజెక్ట్ లో అనుకోని మార్పులు వస్తే వెంటనే త్రివిక్రమ్ ను క్యాచ్ చేసి అఖిల్ వైపు రప్పించాలి అన్న ఎత్తుగడతో నాగార్జున చాల వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నాడు అని తెలుస్తుంది. మరి నాగ్ స్కెచ్ ఎంతవరకూ వర్కౌట్ అవుతుందో చూడాలి.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus