వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరనున్న నాగార్జున

  • July 6, 2017 / 12:51 PM IST

అక్కినేని నాగేశ్వరరావు ప్రత్యక్ష రాజకీయాల్లోకి వెళ్ళలేదు. అయినా ఆయన ముఖ్యమంత్రులతో స్నేహంగా ఉండేవారు. అదే పద్ధతిని  ఆయన కుమారుడు అక్కినేని నాగార్జున ఇప్పటి వరకు పాటించారు. రాష్ట్ర ముఖ్యమంత్రులతో స్నేహపూర్వకంగా ఉన్నారు. ఏ పార్టీ తరుపున ప్రచారం చేయలేదు. ఆహ్వానాలు వచ్చినప్పటికీ ఏ రాజకీయ పార్టీలో చేరలేదు. సినిమాలు, వ్యాపారాలతో బిజీగా ఉన్న నాగ్ ప్రస్తుతం రాజకీయరంగంలో అడుగు పెట్టనున్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరపున 2019 ఎన్నికల్లో పోటీకి దిగనున్నట్లు సమాచారం. నాగ్‌‌కు వైఎస్ కుటుంబంతో మంచి అనుబంధం ఉంది. వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నాగార్జున కాంగ్రెస్ పథకాలను ఉచితంగా ప్రచారం చేశారు.

నాగార్జున వ్యాపారాలకు వైఎస్ అండగా ఉండేవారు. ఆ అనుబంధంతోనే జగన్ తో కలిసి నడిచేందుకు నాగ్ ఒకే చెప్పినట్లు తెలిసింది. అంతేకాదు నాగార్జునకు విజయవాడ సీటును జగన్ కేటాయించినట్లు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో జోరుగా ప్రచారం సాగుతోంది. ఈ వార్తల్లో ఎంతవరకు వాస్తవం ఉందో మరికొన్ని రోజుల్లో స్పష్టం కానుంది.


Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus