Balakrishna: ”భారతరత్న అవార్డు నా తండ్రి కాలిగోరితో సమానం”

  • July 22, 2021 / 10:57 AM IST

టాలీవుడ్ సీనియర్ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ మరోసారి నోరు పారేసుకున్నారు. ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహ్మాన్ ఎవరో తనకు తెలియదంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. అలానే భారతరత్న అవార్డు తన తండ్రి ఎన్టీఆర్ కాలిగోటితో సమానమని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. బాలయ్య హీరోగా నటించిన ‘ఆదిత్య 369’ సినిమా ఇటీవల ముప్పై ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఓ టీవీ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో బాలయ్య షాకింగ్ కామెంట్స్ చేశారు.

ఏఆర్ రెహ్మాన్ కు ఆస్కార్ అవార్డు వచ్చినా.. ఆయనెవరో తనకు తెలియదని అన్నారు బాలయ్య. ఏదో పదేళ్లకు ఒకసారి హిట్స్ అందిస్తాడు.. ఆస్కార్ అవార్డ్ అంటారు .. అవన్నీ పట్టించుకోనంటూ బాలయ్య చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ఇళయరాజా ప్రస్తావన వచ్చిన సమయంలో ఆయన దగ్గర పని చేసిన రెహ్మాన్ గురించి ఈ వ్యాఖ్యలు చేశారు బాలయ్య. ఇక అవార్డుల గురించి మాట్లాడుతూ.. భారతరత్న అవార్డు తన తండ్రి ఎన్టీఆర్ కాలిగోరు, కాలి చెప్పుతో సమానమని అన్నారు.

అవార్డు ఇచ్చిన వాళ్లకు గౌరవం.. కానీ ఆయనకు గౌరవం ఏంటంటూ.. ప్రశ్నించారు. టాలీవుడ్ కి తన కుటుంబం చేసిన కృతికి ఏ అవార్డు కూడా సరిపోదని.. ఎన్టీఆర్ భారతరత్న కంటే గొప్పోడు అంటూ చెప్పుకొచ్చారు. ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో దుమారం రేపుతున్నాయి. రెహ్మాన్ అంటే తెలియదని చెప్పిన బాలయ్య 1993లో అతడితో ‘నిప్పురవ్వ’ అనే సినిమాకి కలిసి పని చేశాడు.

Most Recommended Video

‘నారప్ప’ మూవీ నుండీ అదిరిపోయే డైలాగులు..!
తన 16 ఏళ్ల కెరీర్ లో అనుష్క రిజెక్ట్ చేసిన సినిమాల లిస్ట్..!
వెంకీ చేసిన ఈ 10 రీమేక్స్.. ఒరిజినల్ మూవీస్ కంటే బాగుంటాయి..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus