నందమూరి హీరోల సినిమాలపై లేటెస్ట్ స్టోరీ…

  • October 28, 2016 / 11:37 AM IST

నందమూరి హీరోలలో బాలయ్య, ఎన్టీఆర్ ఇప్పటికే టాప్ హీరోలుగా కొనసాగుతున్నారు.కళ్యాణ్ రామ్ పటాస్, ఇజం వంటి సినిమాలతో జోరు పెంచాలని నిర్ణయించుకున్నాడు. గత కొద్దిరోజులుగా ఈ ముగ్గురు చేయబోయే సినిమాలపై చర్చ జరుగుతూ వస్తోంది.వీరితో చేయనున్న దర్శకుల జాబితాలో కొత్తవాళ్లు కూడా చేరారు.వారిపైనే ఈ కథనం.వందో చిత్రంగా ‘శాతకర్ణి’ సినిమా చేస్తున్న నందమూరి బాలకృష్ణ 101వ సినిమా కృష్ణవంశీ తెరకెక్కించనున్న రైతు అని ఖాయమైపోయింది. దాంతో అందరి దృష్టి 102పై పడింది.అనిల్ రావిపూడి, లయన్ దర్శకుడు సత్యదేవా వంటి వారు ఈ అవకాశం కోసం ఇప్పటికే ఎదురు చూస్తున్నారు. తాజాగా ఈ లిస్ట్ లోకి పూరి జగన్నాధ్ వచ్చి చేరారని గుసగుసలు.తన వద్ద పదేళ్లకు సరిపడా కథలున్నాయన్న పూరి బాలయ్య కోసం ఓ కథ అనుకున్నారట.

ప్రస్తుతం ఆయన ఆసక్తి చూపిన మహేశ్, ఎన్టీఆర్ వంటి హీరోలు పూరిపై సుముఖంగా లేకపోవడంతో ఆయన బాలయ్యను ట్రై చేస్తున్నారట. వినవచ్చే మరో విషయమేమిటంటే మహేశ్ తో చేయాల్సిన ‘జనగణమన’ కథనే బాలయ్యకు వినిపించాలని ప్రయత్నిస్తున్నారట పూరి.ఇక జూనియర్ విషయానికొస్తే పొరుగు రాష్ట్ర దర్శకుడు లింగుసామి నుండి త్రివిక్రమ్, పూరి లాంటి టాలీవుడ్ అగ్ర దర్శకుల పేర్లు ఎన్టీఆర్ చేయబోయే దర్శకుల పుస్తకంలో పాతబడిపోయాయి. అందులో కొత్తగా చేరిన పేరు చందు మొండేటి.’కార్తికేయ’, ‘ప్రేమమ్’ వంటి వరుస విజయాలు అందుకున్న చందు అంటే ఎన్టీఆర్ సానుకూలంగా ఉన్నారట. చందు ఆయనకు తగ్గ కథ తీసుకెళ్తే బండి ముందుకు కదిలే అవకాశముంది. ఆ మేరకు చందుకి సూచనలు అందాయట మరి.

మిగిలింది కళ్యాణ్ రామ్. ‘ఇజం’ ఎలాంటి ఫలితాన్నిచ్చినా సినిమాపై కళ్యాణ్ రామ్ కి ఉన్న తపనను పరిశ్రమకు తెలియజేసింది. దాంతో కళ్యాణ్ రామ్ తో సినిమాలు చేయడానికి దేవా కట్టా, అనిల్ రావిపూడి, పరశురామ్ వంటి దర్శకులు ఆసక్తి చూపుతున్నారు.వీరితోపాటు రైడ్, వీర, అబ్బాయితో అమ్మాయి చిత్రాల దర్శకుడు రమేష్ వర్మ కూడా కళ్యాణ్ రామ్ కోసం ఓ కథను సిద్ధం చేశారట. అయితే ఈ ముగ్గురు ఎవరితో ముందు జతకడతారన్నది ప్రస్తుతానికి..?

https://www.youtube.com/watch?v=qDchtrJlef8

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus