నానితో రొమాన్స్ కి ముగ్గురు హీరోయిన్లు రెడీ..!

  • February 4, 2019 / 12:59 PM IST

నాని హీరోగా చేస్తున్న ‘జెర్సీ’ చిత్ర షూటింగ్.. దాదాపు పూర్తయ్యింది. ‘మళ్ళీ రావా’ ఫేమ్ గౌతమ్ తిన్ననూరి డైరెక్షన్లో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో శ్రద్ద శ్రీనాథ్ హీరోయిన్ గా నటిస్తుంది. స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో నాని క్రికెటర్ గా కనిపిస్తున్నాడు. ‘సితారా ఎంటర్టైన్మెంట్స్’ బ్యానర్ పై సూర్య దేవర నాగ వంశీ నిర్మిస్తున్న ఈ చిత్రం సమ్మర్ కానుకగా ఏప్రిల్ 19 న విడుదల కాబోతుంది. ఇక ఈ చిత్రం తరువాత… తాను చేయబోయే తరువాతి సినిమాకి సంబందించిన పనులు కూడా చక – చకా జరిగిపోతున్నాయట.

ఇక నాని.. తన 24 వ చిత్రాన్ని ‘మనం’ ఫేమ్ విక్రమ్ కుమార్ డైరెక్షన్లో చేయబోతున్నాడు. విభిన్నమైన కథాంశాలను తెరకెక్కించడంలో దర్శకుడు విక్రమ్ కుమార్ దిట్ట. తన ప్రతీ సినిమా.. కథలో కొత్తదనం .. కథనంలో వైవిధ్యం ఉండేలా చూసుకుంటూ ఉంటాడు. ఇక తను నానితో చేయబోయే సినిమాకి కూడా అలాంటి కొత్తదనాన్నే ప్రెజెంట్ చేయబోతున్నాడు. ఈ చిత్రంలో నాని మధ్య వయస్కుడిగా .. వృద్ధుడిగా కూడా కనిపించబోతున్నాడట. నాని పాత్రతో ట్రావెల్ చేస్తూ ఈ చిత్రంలో.. అయిదుగురు కథానాయికలు కనిపించనున్నారని తెలుస్తుంది. వీళ్ళలో ఇప్పటికే కీర్తి సురేశ్ .. ప్రియా వారియర్ .. మేఘ ఆకాశ్ లను ఖరారు చేశారు చిత్ర యూనిట్. నాని గతంలో కీర్తి సురేష్ తో ‘నేను లోకల్’ చిత్రంలో నటించాడు. ఆ చిత్రం బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది.

ఇక విక్రమ్ కుమార్ తో చేయబోయే సినిమాలో మరో ఇద్దరు కథానాయికల కోసం గాలిస్తున్నారట. ‘ది క్యూరియస్ కేస్ ఆఫ్ బెంజిమెన్ బటన్’ అనే హాలీవుడ్ సినిమా ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు విక్రమ్ కుమార్. ఫిబ్రవరి 19 నుండీ ఈ చిత్ర రెగ్యులర్ షూటింగ్ మొదలు కాబోతుంది. శరవేగంగా ఈ చిత్ర షూటింగ్ ను పూర్తి చేసి.. డిసెంబర్ చివరి వారంలో విడుదల చేసే విధంగా చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తుంది. ఇటీవల డైరెక్టర్ విక్రమ్ కుమార్ నుండీ వచ్చిన ’24’ ‘హలో’.. చిత్రాలకి మంచి రివ్యూలు, మౌత్ టాక్ వచ్చినప్పటికీ.. ఆశించిన స్థాయిలో విజయాన్ని ఇవ్వలేకపోయాయి. నానితో చేయబోయే చిత్రంతో ఎలాగైనా బౌన్స్ బ్యాక్ అవ్వాలని డైరెక్టర్ .. విక్రమ్ కుమార్ భావిస్తున్నాడట.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus