స్వప్న దత్ తో కలిసి సెకండ్ సినిమా ప్లాన్ చేస్తున్న నాని

  • April 23, 2019 / 01:22 PM IST

రెండు ఫ్లాపుల తర్వాత వచ్చిన సూపర్ హిట్ తో ప్రస్తుతం ఫుల్ హ్యాపీగా ఉన్న నాని ఆ ఆనందంలోనే నిర్మాతగానూ తన రెండో అడుగు వేయదలుచుకున్నట్లున్నాడు. అందుకే.. తనకు “ఎవడే సుబ్రమణ్యం” లాంటి కమ్ బ్యాక్ ఫిలిమ్ ఇచ్చిన నిర్మాత స్వప్నదత్ తో కలిసి ఒక సినిమా ప్రొడ్యూస్ చేయనున్నాడు నాని. రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శి, నవీన్ పోలిశెట్టి హీరోలుగా.. శాలిని పాండే ప్రధాన పాత్రలో తెరకెక్కనున్న ఈ చిత్రానికి “పిట్టగోడ” చిత్రంతో దర్శకుడిగా పరిచయమైన అనుదీప్ దర్శకత్వం వహించనున్నాడు. ఫుల్ లెంగ్త్ కామెడీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కనున్న ఈ చిత్రాన్ని స్వప్న దత్ తో కలిసి నాని నిర్మించనున్నాడు.

నాలుగు పాత్రల చుట్టూ తిరిగే కామెడీ కథతో తెరకెక్కనున్న ఈ చిత్రం కాన్సెప్ట్ నచ్చిన నాని ఈ చిత్రాన్ని నిర్మించడానికి ముందుకొచ్చాడు. నాని నిర్మించిన “అ!” కమర్షియల్ గా భారీ విజయం సాధించకపోయినా నిర్మాతగా మనోడికి మంచి పేరు తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ఈ రెండో చిత్రంతో కమర్షియల్ హిట్ కొట్టాలని ఫిక్స్ అయినట్లున్నాడు నాని. ఆల్రెడీ హీరోగా సూపర్ హిట్ కొట్టాడు కాబట్టి.. ఇక ప్రొడ్యూసర్ గానూ హిట్ కొట్టేసి ఆల్ రౌండర్ అనిపించుకునేలా ఉన్నాడు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus