Naresh,Pavitra Lokesh: వైరల్ అవుతున్న సీనియర్ నరేష్ ఆసక్తికర వ్యాఖ్యలు!

  • May 29, 2023 / 06:32 PM IST

నరేష్ పవిత్ర లోకేశ్ కాంబినేషన్ లో తెరకెక్కిన మళ్లీ పెళ్లి సినిమా భారీ బడ్జెట్ తో తెరకెక్కినా ఆశించిన స్థాయిలో కలెక్షన్లను సొంతం చేసుకోలేదు. రిలీజ్ రోజున ఈ సినిమాకు కేవలం 30 లక్షల రూపాయల గ్రాస్ కలెక్షన్లు వచ్చాయని సమాచారం. అయితే రిలీజ్ తర్వాత పరిస్థితి మారింది. మళ్లీ పెళ్లి సినిమా సక్సెస్ మీట్ లో నరేష్ మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేయగా ఆ కామెంట్లు తెగ వైరల్ అవుతున్నాయి.

నరేష్ మాట్లాడుతూ భారతీయుడిగా, తెలుగువాడిగా పుట్టడం గర్వంగా ఉందని అన్నారు. సినిమా కుటుంబంలో పుట్టి దాదాపుగా 50 సంవత్సరాలుగా ప్రేక్షకులను అలరిస్తున్నందుకు సంతోషం కలుగుతోందని ఆయన కామెంట్లు చేశారు. కృష్ణగారు తన జీవిత భాగస్వామి విజయనిర్మల ఆలోచనలను ప్రజల్లోకి తీసుకెళ్లడం కోసం విజయకృష్ణ బ్యానర్ ను ప్రారంభించరని సీనియర్ నరేష్ చెప్పుకొచ్చారు.

నా వరకు బోల్డెస్ట్ కపుల్ అంటే కృష్ణ, విజయనిర్మల అని (Naresh) నరేష్ కామెంట్లు చేశారు. ఎమ్మెస్ రాజుతో మూడేళ్ల పాటు మా ప్రయాణం సాగిందని ఆయన పేర్కొన్నారు. ఈ సినిమాను ఇష్టపడి ఏడాది పాటు చేశామని నరేష్ పేర్కొన్నారు. మా గురించి వచ్చే కామెంట్లను పట్టించుకోకుండా ముందుకు సాగాలని నిర్ణయం తీసుకున్నామని నరేష్ అన్నారు. కోకిల మూవీ నుంచి శరత్ బాబుతో మంచి అనుబంధం ఉందని ఆయన తెలిపారు.

చివరి రోజు షూటింగ్ పూర్తైన సమయంలో “పవిత్రను జాగ్రత్తగా చూసుకో.. తను చాలా మంచిది.. సంతోషంగా ఉండండి” అని శరత్ బాబు చెప్పారని నరేష్ అన్నారు. శరత్ బాబును ఎంతగానో మిస్ అవుతున్నానని ఆయన కామెంట్లు చేశారు. జయసుధ నాకు అక్క వరస అయినా అమ్మలా అండగా నిలిచిందని నరేష్ చెప్పుకొచ్చారు. ఈ సినిమాకు ఓటీటీల నుంచి భారీ ఆఫర్లు వస్తున్నాయని సమయం వచ్చినప్పుడు ఓటీటీలో రిలీజ్ చేస్తామని ఆయన తెలిపారు.

మేమ్ ఫేమస్ సినిమా రివ్యూ & రేటింగ్!
సత్తిగాని రెండెకరాలు సినిమా రివ్యూ & రేటింగ్!

మళ్ళీ పెళ్లి సినిమా రివ్యూ & రేటింగ్!
‘డాడీ’ తో పాటు చిరు – శరత్ కుమార్ కలిసి నటించిన సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus