కృష్ణ అంతిమయాత్రలో నరేశ్‌- పవిత్రా లోకేశ్‌.. వైరల్ అవుతున్న ఫోటో !

  • November 16, 2022 / 08:09 PM IST

సూపర్‌ స్టార్‌ కృష్ణ గారు నిన్న కాలం చేసిన సంగతి తెలిసిందే. దీంతో తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ఆయన అభిమానులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. ఆదివారం అర్ధరాత్రి అనారోగ్య సమస్యలతో కాంటినెంటల్‌ హాస్పిటల్లో చేరిన కృష్ణ.. చికిత్స పొందుతూ మంగళవారం నాడు తెల్లవారుజామున 4 గంటల 9 నిమిషాలకు మరణించారు. ఆయన పార్థివదేహాన్ని సందర్శించేందుకు సినీ రాజకీయ ప్రముఖులు నానక్ రామ్ గూడాలోని ఆయన నివాసానికి వెళ్లి నివాళులర్పించారు.

బుధవారం నుండి కృష్ణ భౌతిక కాయాన్ని పద్మాలయ స్టూడియో వద్ద ఉంచగా అక్కడికి కూడా భారీ స్థాయిలో అభిమానులు, సినిమా తారలు విచ్చేసి నివాళులు అర్పించారు. అటు తర్వాత అంతిమయాత్ర నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమంలో కృష్ణ గారి రెండో భార్య కుమారుడు, సీనియర్ నటుడు అయిన నరేష్ కూడా పాల్గొన్నాడు. పద్మాలయ స్టూడియో నుండి జూబ్లీహిల్స్‌ మహాప్రస్థానం వరకు జరిగిన అంతిమయాత్ర కార్యక్రమంలో ఘట్టమనేని కుటుంబ సభ్యులతో పాటు వేలాది మంది అభిమానులు కూడా పాల్గొన్నారు.

కృష్ణ గారి అంతిమయాత్రలో కూడా నరేష్- పవిత్రలు స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచారు.మేము స్నేహితులం అని వీళ్ళు పైకి చెప్పుకుంటున్నప్పటికీ.. వీళ్ల వ్యవహారం అందరికీ తెలిసిందే. అందుకు సంబంధించిన ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మరోపక్క ఒకే ఏడాది ముగ్గురు కుటుంబ సభ్యులను కోల్పోయి మహేష్ డీలా పడిపోయాడు. కృష్ణ గారు మహేష్ కు అలాగే ఘట్టమనేని ఫ్యామిలీకి పెద్ద దిక్కుగా ఉండేవారు. కానీ ఇప్పుడు ఫ్యామిలీ బాధ్యతలు మొత్తం మహేష్ పైనే పడినట్టు తెలుస్తుంది.

యశోద సినిమా రివ్యూ& రేటింగ్!
సరోగసి నేపథ్యంలో వచ్చిన సినిమాలు ఏంటంటే..?

‘కె.జి.ఎఫ్’ టు ‘కాంతార’..బాక్సాఫీస్ వద్ద అత్యధిక కలెక్షన్లు రాబట్టిన కన్నడ సినిమాల లిస్ట్..!
నరేష్ మాత్రమే కాదు ఆ హీరోలు కూడా భార్యలు ఉన్నప్పటికీ హీరోయిన్లతో ఎఫైర్లు నడిపారట..!

Read Today's Latest Gallery Update. Get Filmy News LIVE Updates on FilmyFocus