నవీన్ చంద్ర, గాయత్రీ సురేష్ హీరోహీరోయిన్లుగా జి. ఎస్. కార్తీక్ దర్శకత్వంలో చిత్రం ప్రారంభం

  • July 4, 2018 / 12:14 PM IST

స్వాతి పిక్చర్స్ బ్యానర్లో నవీన్ చంద్ర, గాయత్రీ సురేష్ హీరోహీరోయిన్లుగా ‘అడ్డా, ఓటర్’ చిత్రాల దర్శకుడు జి. ఎస్. కార్తీక్ దర్శకత్వంలో నిర్మాత భార్గవ్ మన్నె నిర్మిస్తున్న చిత్రం బుధవారం (జూలై 4) పూజా కార్యక్రమాలతో షూటింగ్ ప్రారంభమైంది.

ఈ సందర్భంగా చిత్ర నిర్మాత భార్గవ్ మన్నె మాట్లాడుతూ.. దర్శకుడు కార్తీక్ మంచి కథ చెప్పారు. లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ అంశాలు పుష్కలంగా ఉండటమే కాకుండా, సరి కొత్త పాయింట్ తో ఈ చిత్రం ఉంటుంది. కష్టపడే టీమ్ కుదిరింది. మేకింగ్ లో ఎక్కడా కాంప్రమైజ్ అవ్వకుండా క్వాలిటీ చిత్రాన్ని మా బ్యానర్ ద్వారా అందిస్తాము..అన్నారు.

చిత్ర దర్శకుడు జి. ఎస్. కార్తీక్ మాట్లాడుతూ.. ప్రేక్షకులకు కావాల్సిన అన్ని అంశాలు ఈ చిత్రంలో ఉంటాయి. త్వరలోనే టైటిల్ ప్రకటిస్తాము. నిర్మాత మరియు టీమ్ అందరి సహకారంతో అందరూ మెచ్చేలా, అందరికి నచ్చేలా ఈ సినిమా ఉంటుంది.. ” అని అన్నారు.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus