బాలకృష్ణ సినిమాకి భారీ రెమ్యునరేషన్ అడిగిన నయనతార

  • June 24, 2017 / 02:03 PM IST

విజయాలతో పాటు, వివాదాలు నయన తారకు బాగా కలిసి వచ్చాయి. హీరోయిన్ గా నటించిన సినిమాలు సూపర్ హిట్ అయి వార్తల్లో నిలిచిన ఈ బ్యూటీ, ప్రేమ, రెమ్యునరేషన్ విషయాల్లో ట్రెండింగ్ లో ఉన్నింది. తాజాగా భారీ రెమ్యునరేషన్ తో నిర్మాతకు షాక్ ఇచ్చి టాలీవుడ్ టాక్ ఆఫ్ ది టౌన్ గా మారింది. వివరాల్లోకి వెళితే.. ప్రస్తుతం పూరి జగన్నాథ్ దర్శకత్వంలో బాలకృష్ణ “పైసా వసూల్” సినిమా చేస్తున్నారు. ఈ చిత్రం సెట్స్ మీద ఉండగానే బాలయ్య  తమిళ సీనియర్ డైరెక్టర్ కె.ఎస్.రవికుమార్ దర్శకత్వంలో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ప్రముఖ నిర్మాత సి.కల్యాణ్ భారీ బడ్జెట్ తో నిర్మించనున్న ఈ మూవీ షూటింగ్ జులై 10 నుంచి మొదలుకానుంది. ఇందులో హీరోయిన్ గా నయనతారను తీసుకోవాలని డైరక్టర్ అనుకున్నారు. నయన, బాలయ్య కాంబినేషన్ హిట్ కాంబినేషన్ గా పేరుంది. వారిద్దరూ కలిసినటించిన సింహా బాలకృష్ణకు పూర్వవైభవాన్ని తీసుకొచ్చింది.

సో సెంటిమెంట్ కోసం నయనతారని నిర్మాత రీసెంట్ గా సంప్రదించారు. అందుకు ఆమె నాలుగు కోట్ల రెమ్యునరేషన్ అడిగినట్లు సమాచారం. ఇప్పటి వరకు తెలుగులో టాప్ హీరోయిన్లు 2 కోట్ల వద్దే ఉన్నారు. ఆమె 4 కోట్లు అడిగేసరికి షాక్ తిన్నారు. అయినా కాంబినేషన్ కి ఉన్న క్రేజ్ ని దృష్టిలో ఉంచుకొని అడిగినంత ఇవ్వడానికి కళ్యాణ్ సిద్ధమయ్యారు. నయనతార ఈ ప్రాజక్ట్ పై సంతకం చేయడమే మిగిలి ఉంది. సైన్ చేయగానే అధికారిక ప్రకటన వెలువడనుంది. రెడ్డిగారు అనే టైటిల్ అనుకుంటున్న ఈ సినిమాను ఐదు నెలల్లోనే పూర్తి చేసి సంక్రాంతికి రిలీజ్ చేసే ప్రణాళికల్లో ఉన్నారు.


Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus