Nayanthara: ఎట్టకేలకు తమ పిల్లల పేర్లు అనౌన్స్ చేసిన నయన్ దంపతులు!

  • April 3, 2023 / 08:20 PM IST

తెలుగు, తమిళ భాషల్లో స్టార్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగిన నయనతార.. ఆ తర్వాత హీరోయిన్ సెంట్రిక్ సినిమాలు చేసి లేడీ సూపర్ స్టార్ ఇమేజ్ ను సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం బాలీవుడ్లో షారుఖ్ ఖాన్ నటిస్తున్న ‘జవాన్’ మూవీలో కూడా హీరోయిన్ గా నటిస్తుంది నయన్. ఇదిలా ఉండగా.. గత ఏడాది తన ప్రియుడు విఘ్నేష్ శివన్ ను పెళ్లి చేసుకుని ఫ్యామిలీ లైఫ్ లోకి ఎంట్రీ ఇచ్చింది నయన్.

అటు తర్వాత ఈ దంపతులు సరోగసి ద్వారా కవలలకు జన్మనిచ్చిన (Nayanthara) సంగతి తెలిసిందే. అయితే ఇప్పటివరకు తమ పిల్లల ముఖాలను బయటికి చూపించింది లేదు. పలుమార్లు తమ పిల్లలతో ఎయిర్పోర్ట్ లో దర్శనమిచ్చిన ఈ జంట.. తన పిల్లల ముఖ్యలను కెమెరా కంట పడకుండా జాగ్రత్త పడ్డారు. కనీసం పేర్లు కూడా బయటకు చెప్పలేదు. అయితే తాజాగా ఓ కొడుకు పేరు ‘ఉయిర్ రుద్రోనిల్ ఎన్ శివన్’ అని, రెండో కొడుకు పేరు ‘ఉలగ్ ధైవాగ్ ఎన్ శివన్’ అని విగ్నేష్ శివన్ తన సోషల్ మీడియా ద్వారా తెలియజేసారు.

అయితే సరోగసి విధానం ద్వారా ఇద్దరు కవల పిల్లలకు జన్మనివ్వడం అనేది చట్టానికి వ్యతిరేకమని సోషల్ మీడియాలో తెగ చర్చ జరిగింది. ఈ విషయం పై తమిళనాడు ప్రభుత్వం మాత్రం చట్టానికి లోబడే వారు సరోగసితో పిల్లల్ని కన్నారంటూ పేర్కోనడంతో ఆ వార్తలకు ఫుల్ స్టాప్ పడినట్టు అయ్యింది.

హీలీవుడ్‌లో నటించిన 15 మంది ఇండియన్ యాక్టర్స్ వీళ్లే..!
టాలీవుడ్‌లో గుర్తింపు తెచ్చుకున్న 10 మంది కోలీవుడ్ డైరెక్టర్స్ వీళ్లే..!

తు..తు…ఇలా చూడలేకపోతున్నాం అంటూ…బాడీ షేమింగ్ ఎదురుకున్న హీరోయిన్లు వీళ్ళే
నాగ శౌర్య నటించిన గత 10 సినిమాల బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus