రేణు దేశాయ్ కి అసభ్య మెసేజులు పంపిన నెటిజన్

  • March 13, 2019 / 06:28 PM IST

పాపం పవన్ కళ్యాణ్ మాజీ సతీమణి రేణు దేశాయ్ ఆయన నుంచి విడాకులు తీసుకొని ప్రశాంతగా తన పని తాను చూసుకుంటున్నప్పటికీ.. కొందరు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ మాత్రం ఆమెను వదలడం లేదు. రీసెంట్ గా ఆమె సాక్షి టీవీ కోసం రైతు సమస్యలను ఉద్దేశించి ఒక ప్రోగ్రామ్ మొదలెట్టినప్పుడు ఆమె రాజకీయ రంగప్రవేశం చేస్తుందని, త్వరలోనే జగన్ పార్టీలో జాయినై.. పవన్ కళ్యాణ్ కు పోటీగా ప్రచారం చేయనుందని వార్తలొచ్చాయి.

కట్ చేస్తే.. తాను రాజకీయాల్లోకి రావడం లేదని రేణు స్వయంగా చెప్పడంతో ఆ ఇష్యూ కవర్ అయిపోయింది. కానీ.. ఆమెకు కొందరు ఇంకా అసభ్య మెసేజులు పెడుతూనే ఉన్నారు. రీసెంట్ గా ఒకడు ఆమెను తిడుతూ మెసేజ్ పెట్టాడు. “రైతుల సమస్యలు నీకేం తెలుసు, నీకు కేవలం పవన్ కళ్యాణ్ ఎక్స్ వైఫ్ గౌరవం ఉంది” అని మెసేజ్ చేశాడు. ఆ మెసేజ్ ను స్క్రీన్ షాట్ తీసి షేర్ చేసింది రేణు దేశాయ్. ఆమెను ఇలా తిట్టడం ఎంతవరకూ కరెక్ట్ అని ప్రశ్నించింది. మరి రేణు దేశాయ్ కి ఈ ఆన్లైన్ కష్టాలు ఎప్పటికీ తీరతాయో ఏమో.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus