ఈసారి నిజంగానే అనసూయ తప్పుకుందా..?

  • June 5, 2020 / 03:45 PM IST

గత కొన్నేళ్ళుగా అనసూయ.. ‘జబర్దస్త్’ నుండీ తప్పుకుంటుంది అంటూ తెగ ప్రచారం జరుగుతుంది. ‘నాగబాబు రిఫరెన్స్ తో అనసూయ ‘అదిరింది’ షోకు షిఫ్ట్ అయిపోతుందని.. అందుకు గాను భారీ ఎత్తున పారితోషికం కూడా మాట్లాడుకుంది అంటూ వార్తలు వచ్చాయి. అయితే ఈ వార్తల్లో ఎటువంటి నిజం లేదని.. అనసూయ ఎన్నో సార్లు క్లారిటీ ఇచ్చినా ఈ వార్తలు ఆగడం లేదు. ఇదిలా ఉంటే.. ఇప్పుడు మరోసారి అనసూయ ‘జబర్దస్త్’ కు దూరమవుతుంది అంటూ మళ్ళీ వార్తలు మొదలయ్యాయి.

ఈసారి ఆమె ప్లేస్ లో మరో యాంకర్ ను తీసుకుంటున్నారు అంటూ కూడా ప్రచారం జరుగుతుంది. అయితే ఇది కూడా ఫేక్ న్యూసే అని అంతా అభిప్రాయపడుతున్నారు. ఈ విషయం పై అనసూయ అయితే క్లారిటీ ఇవ్వలేదు కానీ.. ఈ వార్తలు కొంత వరకూ నిజం ఉందని తెలుస్తుంది. అనసూయ ఇప్పుడు సినిమాల్లో కూడా నటిస్తుంది. ఆమె కమిట్ అయిన సినిమాల షూటింగ్ లు లాక్ డౌన్ వల్ల ఆగిపోయాయి.

కాబట్టి కొన్నాళ్ళు అనసూయ ‘జబర్దస్త్’ కు బ్రేక్ ఇచ్చి ఆమె కమిట్ అయిన సినిమాల షూటింగ్ లు పూర్తిచెయ్యాలి అని భావిస్తుందట. ఆమె స్థానంలో యాంకర్ మంజుష ను తీసుకోబోతున్నరాట. ఈమె కూడా పాపులర్ యాంకరే..! గతంలో ఈమె ‘రాఖీ’ సినిమాలో ఎన్టీఆర్ చెల్లిగా కూడా నటించింది. అయితే ‘జబర్దస్త్’ కు అనసూయ బ్రేక్ మాత్రమే ఇస్తుంది అని మాత్రమే ప్రస్తుతానికి కన్ఫార్మ్ అయ్యింది.

Most Recommended Video

మేకప్‌ లేకుండా మన టాలీవుడ్ ముద్దుగుమ్మలు ఎలా ఉంటారో తెలుసా?
జ్యోతిక ‘పొన్‌మగల్‌ వందాల్‌’ రివ్యూ
ఈ డైలాగ్ లు చెప్పగానే గుర్తొచ్చే హీరోయిన్లు!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus