ఇప్పటికి పూజా హెగ్డే తప్పించుకుంది

  • October 14, 2018 / 03:09 AM IST

తెలుగు చిత్ర పరిశ్రమలో సెంటిమెంట్స్ కి కూడా ప్రాముఖ్యత ఇస్తుంటారు. అందం, అభినయం ఉన్నప్పటికీ హీరోయిన్స్ పై కొన్నిసార్లు నిందలు వేస్తుంటారు. ఒక నటి నటించిన సినిమాలు వరుసగా ఫెయిల్ అవుతుంటే ఆమెకి ఐరన్ లెగ్ అని ముద్ర వేసేస్తారు. ఆపేరు ని సంపాదించుకున్నవారిలో పూజా హెగ్డే ఒకరు. ఆమె ముకుంద సినిమాతో తెలుగులోకి అడుగుపెట్టారు. ఆ తర్వాత చేసిన “ఒక లైలా కోసం”లో కూడా చక్కని నటనతో ఆకట్టుకున్నారు. అయినా రెండు సినిమాలు కమర్షియల్ హిట్ సాధించలేదు. హిందీలో మొహంజదారో సినిమా చేశారు. అది ఫెయిల్ అయింది. దీంతో దువ్వాడ జగన్నాథంలో స్టైల్ మార్చింది. గ్లామర్ డోస్ పెంచింది. బికినీ అందాలతో అందరినీ పడగొట్టేసింది. ఆ చిత్రం కూడా హిట్ గా నిలబడలేకపోయింది. దీంతో పూజా ఐరన్ లెగ్ అని పిలవడం మొదలు పెట్టారు.

ఆమె నటిస్తే ఆ సినిమా ఫట్ అని ఫిక్స్ అయిపోయారు. అయితే పూజా కెరీర్ కి రంగస్థలం మూవీ చాలా హెల్ప్ చేసింది. ఇందులో ఆమె చేసిన జిగేల్ రాణి పాటతో పాటు సినిమా కూడా ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. కొంతమేర బ్యాడ్ ఒపీనియన్ ని తగ్గించింది. అయితే ఆ తర్వాత హీరోయిన్ గా నటించిన సాక్ష్యం ఫెయిల్ కావడంతో ఆ ముద్ర అలాగే ఉండిపోయింది. కానీ అరవింద సమేత మాత్రం ఐరెన్ లెగ్ అనే పేరుని తుడిచేసింది. త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీలో ఎన్టీఆర్ సరసన పూజా నటించింది. ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టి.. పూజా కెరీర్ ని హిట్ ట్రాక్ లో పెట్టింది. ప్రస్తుతం పూజా మహేష్, ప్రభాస్ సినిమాల్లో నటిస్తోంది. ఈ రెండు సినిమాలపై ఐరెన్ లెగ్ ప్రభావం పోయినట్టేనని ఫిలింనగర్ వాసులు చెబుతున్నారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus