Sarkaru Vaari Paata: పక్కా ప్లాన్ తో రెడీ అవుతున్న సర్కారు వారి పాట టీమ్!

  • August 15, 2021 / 07:11 AM IST

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా ‘గీత గోవిందం’ ఫేమ్ పరశురామ్ (బుజ్జి) దర్శకత్వంలో తెరకెక్కుతున్న మూవీ ‘సర్కారు వారి పాట’ .’మైత్రి మూవీ మేకర్స్’, ’14 రీల్స్ ప్లస్’, ‘జి.ఎం.బి ఎంటర్టైన్మెంట్’ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తుండగా తమన్ సంగీతం అందిస్తున్నాడు. మది సినిమాటోగ్రఫర్.ఇటీవల మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా విడుదల చేసిన ‘సర్కారు వారి పాట’ బ్లాస్టర్ టీజర్ కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది.

దాంతో సినిమా పై అప్పటి వరకు ఉన్న అంచనాలు డబుల్ అయ్యాయనే చెప్పాలి. ఇక ఈ చిత్రం షూటింగ్ ప్రస్తుతం గోవాలో జరుగుతుంది.అనంతరం హైదరాబాద్ లో ప్లాన్ చేశారట. ఎంత కాదనుకున్నా మరో 45 రోజుల్లో సర్కారు వారి పాట షూటింగ్ ఫినిష్ అయ్యే అవకాశాలు ఉన్నాయని తెలుస్తుంది. అక్టోబర్ లో థర్డ్ వేవ్ ఎఫెక్ట్ అంటూ వైద్య నిపుణులు చెబుతుండటంతో సెప్టెంబర్ ఎండింగ్ నాటికి షూటింగ్ కంప్లీట్ చెయ్యాలని

పక్కా ప్లాన్ వేసుకున్నారు మహేష్ అండ్ టీం. అందుకే నాన్ స్టాప్ గా షూటింగ్ ను జరుపుతున్నారు.ఆ తర్వాత పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరిపి జనవరి నాటికి మూవీని రెడీ చేయాలని దర్శక నిర్మాతలు కూడా ప్రయత్నిస్తున్నారు.

Most Recommended Video

నవరస వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!
ఎస్.ఆర్.కళ్యాణమండపం సినిమా రివ్యూ & రేటింగ్!
క్షీర సాగర మథనం సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus