దువ్వాడ జగన్నాథం స్టోరీ పై సరికొత్త రూమర్

  • April 5, 2017 / 08:07 AM IST

బ్లాక్ బస్టర్ హిట్ సరైనోడు తర్వాత అల్లు అర్జున్ చేస్తున్న చిత్రం దువ్వాడ జగన్నాథం. హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీ షూటింగ్ దాదాపు పూర్తికావచ్చింది. దిల్ రాజు నిర్మిస్తున్న ఆ మూవీ సెట్స్ మీదకు వెళ్ళినప్పుడు ఈ సినిమా కథ ఎన్టీఆర్ అదుర్స్ కి సీక్వెల్ అంటూ గాసిప్ వినిపించింది. ఆ రూమర్ ని డీజే టీజర్ బద్దలు చేసింది. టీజర్ లో అల్లు అర్జున్ బ్రాహ్మణ యువకుడిగా కనిపించాడు. తనదైన శైలిలో డైలాగ్ చెప్పి నవ్వులు పూయించాడు. అయితే ఇప్పుడు ఈ సినిమా కథకి సంబంధించి మరో రూమర్ ఫిలిం నగర్ లో చక్కర్లు కొడుతోంది. అన్నపూర్ణ క్యాటరింగ్ సర్వీస్ నడిపే దువ్వాడ జగన్నాథంకి రెండో షేడ్ కూడా ఉంటుందంట.

పగలంతా క్యాటరింగ్ చేసే జగన్నాథం.. రాత్రి వేళల్లో డీజే గా అక్రమార్కులను ఉతికి ఆరేస్తాడని తెలిసింది. చిన్నప్పటి నుంచి ఎక్కడ అన్యాయం జరిగినా ఊరుకోడని, అప్పటి నుంచే ఓ పోలీస్ ఆఫీసర్ కి సాయంగా ఉంటూ యువకుడిగా ఇదిగాక సొంతంగా దుర్మార్గుల అంతు చూస్తాడని సమాచారం.  ఈ కథే నిజమైతే గతంలో శంకర్ దర్శకత్వంలో వచ్చిన జెంటిల్ మ్యాన్ సినిమాకి ఇది అప్డేట్ వెర్షన్ అవుతుంది. అందులో అర్జున్.. ఇందులో అల్లు అర్జున్ అంతే తేడా. మిగతాది అంతా సేమ్ టు సేమ్.


Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus