హిట్టు కోసం నిఖిల్ పాట్లు..!!

  • March 24, 2016 / 02:14 PM IST

స్వామిరారా, కార్తికేయ, సూర్య వర్సెస్‌ సూర్య’ చిత్రాలతో హ్యా ట్రిక్‌ కొట్టిన నిఖిల్‌కు ఎన్నో అం చనాల మధ్య వచ్చిన “శంకరాభరణం’ చిత్రం ఆశలపై నీళ్లు చల్లింది. దాంతో తాను చేస్తున్న చిత్రానికి మరిన్ని ఎక్కువ జాగ్రత్తలు తీసుకుంటున్నారు. వి.ఐ. ఆనంద్‌ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రంలో నిఖిల్‌ సరసన ముగ్గురు కథానాయికలు నటిస్తున్నారు. ఓ పక్క ఇది నిర్మాణంలో ఉండగానే తన తర్వాతి చిత్రాలకు ఆయన ప్లాన్‌ చేసుకుంటున్నారని అంటున్నారు. లోగడ తనకు హిట్‌ చిత్రాలను అందించిన దర్శకులతో మళ్లీ చిత్రాలు చేసేందుకు సమాయత్తమవుతున్నట్లు సమాచారం. వీలువెంబడి ఈ చిత్రాలు మొదలవుతాయని పరిశ్రమ వర్గాల భోగట్టా.
“స్వామిరారా’ వంటి హిట్‌ చిత్రాన్ని అందించిన సుధీర్‌వర్మ దర్శకత్వంలో ఓ చిత్రాన్ని, అలాగే “కార్తికేయ’ వంటి విజయవంతమైన చిత్రాన్ని తీసిన చందు మొండేటి దర్శకత్వంలో ఓ చిత్రం చేయాలని నిఖిల్‌ నిర్ణయించుకున్నారట. ప్రస్తుతం నాగచైతన్య కథానాయకుడిగా చందు మొండేటి “ప్రేమమ్‌’ చిత్రాన్ని రూపొందిస్తున్న సంగతి తెలిసిందే. ఈ ఇద్దరు దర్శకులకు ఉన్న కమిట్‌మెంట్లు పూర్తికాగానే వారు నిఖిల్‌తో చిత్రాలు చేస్తారని పరిశ్రమలో వినిపిస్తోంది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus