‘నిశ్శబ్దం’ ‘మిస్ ఇండియా’.. ఆ విషయంలో దుమ్ముదులిపేసాయి..!

  • November 9, 2020 / 06:59 PM IST

అనుష్క ప్రధాన పాత్రలో తెరకెక్కిన ‘నిశ్శబ్దం’ చిత్రం గత నెల అమేజాన్ ప్రైమ్‌లో విడుదలైన సంగతి తెలిసిందే. నిజానికి ఈ సినిమాకి అట్టర్ ఫ్లాప్ టాకే వచ్చింది. అయినా సరే.. 2ఏళ్ళ తరువాత అనుష్క నుండీ వచ్చిన చిత్రం కావడంతో ప్రేక్షకులు ఎగబడి చూసారని తద్వారా వ్యూస్ బాగా వచ్చాయని తెలుస్తుంది. డైరెక్ట్ గా అమెజాన్లో రిలీజ్ అయిన సినిమాల్లో వ్యూయర్ షిప్ పరంగా అప్పటికి ‘నిశ్శబ్దం’ టాప్ లో నిలిచింది. దీంతో అంతా షాక్ కు గురయ్యారు.

ఇదిలా ఉండగా.. తాజాగా విడుదలైన కీర్తి సురేష్ ‘మిస్ ఇండియా’ సినిమా విషయంలో కూడా ఇదే జరిగింది. ఈ మధ్యనే నెట్‌ఫ్లిక్స్ లో విడుదలైన ఈ చిత్రం ఓటీటీలో ఇండియా వైడ్ నెంబర్ వన్ ప్లేస్లో ట్రెండ్ అవుతుంది. విడుదల రోజు మాత్రమే కాదు.. వీకెండ్ పూర్తయ్యే వరకూ నంబర్ వన్‌ స్థానంలోనే కొనసాగింది ‘మిస్ ఇండియా’ .ఇక ‘సూటబుల్ బాయ్’ రెండో స్థానంలో నిలవడం విశేషం. ప్రస్తుతం కొత్త సినిమాలేమీ లేకపోవడం కూడా ‘మిస్ ఇండియా’కు అడ్వాంటేజ్ అయినట్టు స్పష్టమవుతుంది.

కీర్తి సురేష్‌ క్రేజ్ ను బట్టి టాక్ టాక్‌తో సంబంధం లేకుండా ప్రేక్షకులు ఈ చిత్రాన్ని చూస్తున్నట్టు విశ్లేషకులు చెప్పుకొస్తున్నారు. మరొక వారం కనుక ఇలాగే ‘మిస్ ఇండియా’ ట్రెండ్ అయితే.. ‘నెట్ ఫ్లిక్స్’ వారు మరిన్ని లాభాలను ఆర్జించే అవకాశం ఉందని టాక్.

Most Recommended Video

ఈ 15 సినిమాలకి మొదటి ఛాయిస్ ఈ హీరోయిన్లు కాదు.. మరెవరో తెలుసా..!
50 కి దగ్గరవుతున్నా.. పెళ్లి గురించి పట్టించుకోని హీరొయిన్ల లిస్ట్..!
‘కలర్ ఫోటో’ నుండీ హృదయాన్ని హత్తుకునే 15 డైలాగులు ఇవే..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus