ఆ ఏజ్ బార్ బ్యాచ్ లర్స్ కి కరోనా భారీ దెబ్బేసింది

  • April 7, 2020 / 07:28 PM IST

ఇద్దరు టాలీవుడ్ బ్యాచ్ లర్స్ 2020 లో హస్బెండ్స్ గా మారాలని పెళ్ళికి సిద్ధమయ్యారు. వారిలో ఒకరు నితిన్ కాగా మరొకరు నిఖిల్ సిద్దార్ధ్. వీరిద్దరూ తమ గర్ల్ ఫ్రెండ్స్ తో పెళ్లి పీటలెక్కాలని ఎంగేజ్మెంట్స్ జరుపుకొన్నారు. ఐతే కరోనా రూపంలో వీరి ఆశలకు గండి పడింది. కరోనా వైరస్ కారణంగా ఇండియాలో టోటల్ లాక్ డౌన్ కొనసాగుతుంది. ప్రతి రాష్ట్రంలో కరోనా బాధితుల సంఖ్య పెరుగుతూ పోతుంది. దీనితో కరోనా కర్ఫ్యూ కొనసాగుతుండగా సెలెబ్రిటీలు ఇంటికే పరిమితం అవుతున్నారు.

దీనితో ఈ ఇద్దరు ఏజ్ బార్ బ్యాచ్ లర్స్ తమ పెళ్లిని వాయిదా వేసుకున్నారు. హీరో నిఖిల్ ఎప్పటి నుండో డాక్టర్ పల్లవితో ప్రేమలో ఉన్నారు. ఈ 34 ఏళ్ల హీరో ఫిబ్రవరి 1న కేవలం కుటుంబ సభ్యుల సమక్షంలో ఎంగేజ్మెంట్ జరుపుకున్నాడు. ఏప్రిల్ 14న పెళ్లి కావాల్సివుండగా వాయిదాపడింది. ఇక నితిన్ కూడా తన గర్ల్ ఫ్రెండ్ షాలిని తో ఫిబ్రవరిలో ఎంగేజ్మెంట్ జరుపుకున్నారు. ఆయన కూడా ఈనెలలో షాలిని మెడలో తాళి కట్టాల్సింది.

దుబాయ్ లో భారీగా డెస్టినేషన్ మ్యారేజ్ జరుపుకోవాలని ప్లాన్ చేశారు. ఇత్ నితిన్ కూడా కరోనా లాక్ డౌన్ కారణంగా తన పెళ్లిని వాయిదా వేసుకున్నారు. ప్రస్తుతం నితిన్ వయసు 37 సంవత్సరాలు. కరోనా కర్ఫ్యూ కారణంగా టాలీవుడ్ కి చెందిన ఈ బ్యాచ్ లర్స్ వివాహాలు వాయిదా పడ్డాయి. మరి వీరి వివాహాలు జరగాలంటే మరో రెండు మూడు నెలల సమయం పట్టేలా ఉంది. సాధారణ పరిస్థితులు ఏర్పడిన వెంటనే నితిన్, నిఖిల్ పెళ్లి పీటలు ఎక్కనున్నారు.

Most Recommended Video

టాలీవుడ్ టాప్ హీరోల వరస్ట్ లుక్స్ ఇవే!
17 ఏళ్లలో అల్లు అర్జున్ రిజెక్ట్ చేసిన సినిమాలు ఇవే!
బుల్లితెర పై రికార్డులు క్రియేట్ చేసిన సినిమాలు ఇవే!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus