స్ట్రయిట్ సినిమాలకంటే రీమేక్ సేఫ్ అనుకున్నాడేమో

  • December 17, 2018 / 07:17 AM IST

“చల్ మోహన్ రంగా, లై, శ్రీనివాస కళ్యాణం” చిత్రాలతో హ్యాట్రిక్ ఫ్లాప్ అనంతరం చిన్న బ్రేక్ తీసుకున్న నితిన్ “ఛలో”తో హిట్ కొట్టిన వెంకీ కుడుముల దర్శకత్వంలో ఒక సినిమా సైన్ చేసిన విషయం తెలిసిందే. ఈ సినిమాతోపాటు చంద్రశేఖర్ ఏలేటి దర్శకత్వంలో ఒక సినిమా చేయాలి అనుకున్నప్పటికీ పెద్దగా వర్కవుట్ అవ్వలేదు. అయితే.. ఇప్పుడు నితిన్ దృష్టి తమిళ సూపర్ హిట్ చిత్రం “రత్ససన్” మీద పడింది. క్రైమ్ థ్రిల్లర్ గా రూపొంది ఘన విజయం సొంతం చేసుకున్న ఈ చిత్రం తమిళనాట సరికొత్త సంచలనాలకు నాంది పలకడమే కాదు.. ఒన్నాఫ్ ది బెస్ట్ ఫిలిమ్ ఆఫ్ ది డెకేడ్ గా నిలిచింది. ఆ సినిమాను తొలుత డబ్బింగ్ చేద్దామనుకున్నప్పటికీ.. సబ్జెట్ కి ఉన్న స్పాన్ చూసి రీమేక్ అయితేనే బెటర్ అనుకున్నారు.

తొలుత ఈ రీమేక్ లో సందీప్ కిషన్ నటిస్తాడని టాక్ వచ్చినప్పటికీ. ఫైనల్ గా నితిన్ దగ్గరకి వచ్చింది ఈ ప్రొజెక్ట్. థ్రిల్లర్స్ తెరకెక్కించడంలో స్పెషలిస్ట్ అయిన సుధీర్ వర్మ ఈ రీమేక్ కు దర్శకత్వం వహించే అవకాశాలున్నాయి. నేటివిటీ పరమైన చిన్న చిన్న మార్పులు తప్ప ప్రొజెక్ట్ లో ఛేంజస్ చేయకుండా సేమ్ టు సేమ్ తీస్తే గనుక తెలుగులో కూడా ఈ సినిమా సూపర్ హిట్ అవ్వడం ఖాయం.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus