సాయి పల్లవి తరువాత ఆ లిస్ట్ లో చేరింది ఆదా శర్మనే..!

  • November 2, 2020 / 04:08 PM IST

తెలుగు సినిమాలకు చాలా వరకూ ముంబైకు చెందిన బ్యూటీలనే హీరోయిన్లుగా ఎంపిక చేసుకుంటూ ఉంటారు మన దర్శకనిర్మాతలు. వాళ్ళు నటించే తెలుగు సినిమాలకు వారు సొంతంగా డబ్బింగ్ చెప్పుకోవడం అనేది అరుదు. చెప్పాలంటే డబ్బింగ్ చెప్పుకోవడం అనేది చాలా పెద్ద భాద్యత. అందుకే వాళ్లకు వేరే ఆర్టిస్ట్ లతో డబ్బింగ్ చెప్పిస్తూ ఉంటారు.అయితే తెలుగులో ఫేమస్ అయిన తరువాత కొంతమంది హీరోయిన్లు సొంతంగా డబ్బింగ్ చెప్పుకున్న సందర్భాలు కూడా లేకపోలేదు.

మన ‘ఫిదా’ బ్యూటీ సాయి పల్లవిని తీసుకుంటే.. తెలుగులో ఎంట్రీ ఇచ్చిన మొదటి చిత్రంతోనే తెలంగాణ యాసలో సొంతంగా డబ్బింగ్ చెప్పుకుని అదరగొట్టింది. అసలు తెలుగురాని హీరోయిన్లు డబ్బింగ్ చెప్పుకోవడమే చాలా కష్టం అనుకుంటే.. ఏకంగా తెలంగాణ స్లాంగ్లో డబ్బింగ్ చెప్పుకోవడం చాలా గొప్ప విషయమని చెప్పాలి. ఇప్పుడు ‘హార్ట్ ఎటాక్’ బ్యూటీ ఆదా శర్మ కూడా తన పాత్రకు తాను సొంతంగా డబ్బింగ్ చెప్పుకుని అందరినీ ఆశ్చర్యపరిచింది.

ఆమె నటిస్తున్న ‘క్వశ్చన్ మార్క్’ చిత్రం కోసం సొంతంగా డబ్బింగ్ చెప్పుకుందట. అది కూడా తెలంగాణ స్లాంగ్లో.. ఇంకో విశేషం ఏమిటంటే.. 24 గంటల్లోనే తన పాత్రకు డబ్బింగ్ పూర్తి చేసిందట. నిజంగా ఇది రెకార్డ్ అనే చెప్పాలి.

Most Recommended Video

‘ఆర్.ఆర్.ఆర్’ : భీమ్ పాత్రకు రాజమౌళి ఆ పాయింటునే తీసుకున్నాడా?
‘బిగ్ బాస్’ అఖిల్ గురించి మనకు తెలియని విషయాలు..!
టాలీవుడ్లో 30 కోట్ల మార్కెట్ కలిగిన హీరోలు ఎవరో తెలుసా?

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus