అల్లు అర్జున్, వంశీ మూవీలో నటించనున్న నివేత

  • June 17, 2017 / 11:21 AM IST

హరీశ్ శంకర్ దర్శకత్వంలో అల్లు అర్జున్ నటిస్తున్న ‘దువ్వాడ జగన్నాథం’ జూన్ 23 న రిలీజ్ కాబోతోంది. ఈ సినిమా థియేటర్లోకి రాకముందే నెక్స్ట్ సినిమాని బన్నీ మొదలెట్టేసాడు. రచయిత  వక్కంతం వంశీ దర్శకత్వంలో ‘నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా’ అనే చిత్రాన్ని లాంఛనంగా ప్రారంభించారు. శిరీషా శ్రీధర్ లగడపాటి నిర్మిస్తోన్న ఈ సినిమా గురించి ఆసక్తికర న్యూస్ బయటికి వచ్చింది. అల్లు అర్జున్ సోల్జర్ గా నటిస్తున్న ఈ చిత్రంలో హీరోయిన్ గా నివేత థామస్ నటిస్తున్నట్లు తెలిసింది. జెంటిల్ మ్యాన్ సినిమాతో తెలుగు పరిశ్రమలోకి అడుగుపెట్టిన ఈ సుందరి .. రెండో సినిమా కూడా నానితోనే చేసింది. నిన్నుకోరి మూవీతో త్వరలో రానుంది.

ప్రస్తుతం నివేత జై లవ కుశ సినిమాలో ఎన్టీఆర్ కి జోడీగా నటిస్తోంది. ఆమె నటనకు ఫిదా అయిన డైరక్టర్ వక్కంతు వంశీ సెలక్ట్ చేసినట్లు సమాచారం. మొదట కన్నడ బ్యూటీ రష్మిక నందనను పరిశీలించిన చిత్ర బృందం ఇప్పుడు నివేతా థామస్ ను ఒకే చెప్పినట్లు ఫిలిం నగర్ వాసులు చెబుతున్నారు. విశాల్ – శేఖర్ సంగీతాన్ని అందిస్తున్న ఈ మూవీ వచ్చే నెల సెట్స్ మీదకు వెళ్లనుంది.


Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus