వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో నటించడానికి ఓకే చెప్పిన నివేదా

  • June 8, 2018 / 06:17 AM IST

మలయాళంలో నివేదా థామస్ నటిగా నిరూపించుకుంది. అక్కడ హిట్స్ సాధించడమే కాదు తెలుగులోనూ హ్యాట్రిక్ హిట్ సాధించింది. నాని “జెంటిల్‌మేన్” తో టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన ఈ భామ తొలి చిత్రంతోనే శెభాష్ అనిపించుకుంది. ఆ తర్వాత “నిన్ను కోరి”, “జై లవకుశ” వంటి చిత్రాలతో తెలుగులో టాప్ హీరోయిన్ జాబితాలో చేరిపోయింది. ఎన్నో అవకాశాలు తలుపు తట్టినా స్టడీ నిమిత్తం కొంతకాలం పరిశ్రమకి దూరమయింది. ప్రస్తుతం కళ్యాణ్ రామ్ హీరోగా తెరకెక్కుతోన్న సినిమాలో నివేదా థామస్ నటిస్తోంది. తాజాగా మరో సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

“‘మెంటల్ మదిలో” చిత్రంతో విభిన్నమైన అభిరుచి కలిగిన దర్శకుడిగా పేరు తెచ్చుకున్న వివేక్ ఆత్రేయ.. తన హీరో శ్రీవిష్ణు మరో చిత్రానికి శ్రీకారం చుట్టారు. ఈ చిత్రం ప్రీ ప్రొడక్షన్ దశలో ఉంది. ఇందులో హీరోయిన్ గా నివేదా థామస్ ని తీసుకున్నారు. ఈ కథలో తన పాత్ర నచ్చడంతో చిన్న హీరో అయినప్పటికీ నివేతా నటించడానికి ఒప్పుకుందని సమాచారం. నివేత ఈ సినిమా విజయానికి మరింత హెల్ప్ అవుతుందని చిత్ర బృందం భావిస్తోంది. ఆమె ఓకే చెప్పినందుకు సంతోషంగా ఉంది. ఈ మూవీ త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లనుంది. అలాగే సినిమా వివరాలను అధికారికంగా ప్రకటించనున్నారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus