లాక్ డౌన్ ఎఫెక్ట్ తో హీరోయిన్ పాత్ర ట్రిమ్ చేస్తున్నారా..?

  • April 18, 2020 / 04:35 PM IST

పవర్ స్టార్ పవన్ తిరిగి సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇస్తూ ‘వకీల్ సాబ్’ ను మొదలుపెట్టారు. బాలీవుడ్ లో సూపర్ హిట్ అయిన ‘పింక్’ చిత్రానికి ఇది రీమేక్. ఇందులో ఎలాంటి కమర్షియల్ ఎలెమెంట్స్ ఉండవు. అయితే ఇదే చిత్రాన్ని తమిళంలో అజిత్ తో ‘నేర్కొండ పార్వే’ గా రీమేక్ చేసారు. తమిళ ప్రేక్షకులకి తగినట్టుగా … అజిత్ ఇమేజ్ ను దృష్టిలో పెట్టుకుని దర్శకుడు వినోద్ అక్కడ ఓ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ ను జోడించాడు.

ఇప్పుడు తెలుగులో పవన్ కళ్యాణ్ వంటి బడా స్టార్ తో తీస్తున్నారు కాబట్టి.. మరింతగా ఆ ఫ్లాష్ ఎపిసోడ్ ను పెంచుతూ.. డ్యూయట్ లు కూడా ప్లాన్ చేసారు. ఇందుకోసం పవన్ సరసన శృతీ హాసన్ ను హీరోయిన్ గా ఎంచుకున్నట్టు వార్తలు అయితే వచ్చాయి కానీ దర్శకనిర్మాతలు కన్ఫార్మ్ చెయ్యలేదు. అయితే అందుతున్న తాజా సమాచారం ప్రకారం… ఇప్పుడు శృతీ హాసన్ ఈ ప్రాజెక్ట్ నుండీ తప్పకుందని తెలుస్తుంది.

దీంతో హీరోయిన్ ట్రాక్ ను కూడా ట్రిమ్ చేయనున్నారు అని టాక్ వినిపిస్తోంది. లాక్ డౌన్ వల్ల షూటింగ్ జరిపే అవకాశం లేదు. లాక్ డౌన్ ఎత్తేసినా… అనుకున్న షెడ్యూల్ ప్రకారం సినిమాను విడుదల చెయ్యాలి అంటే … ఈ అనవసరమైన హడావిడి లేకపోతేనే బెటర్ అనే నిర్ణయానికి దర్శకుడు వేణు శ్రీరామ్ మరియు నిర్మాత దిల్ రాజు వచ్చేసారట. ఇందుకు పవన్ కూడా ఓకే చెప్పేశారని తెలుస్తుంది.

Most Recommended Video

అత్యధిక టి.ఆర్.పి నమోదు చేసిన సినిమాల లిస్టు!
టాలీవుడ్ టాప్ హీరోల వరస్ట్ లుక్స్ ఇవే!
మన హీరోయిన్ల ఫ్యామిలీస్ సంబంధించి రేర్ పిక్స్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus