మరో మల్టీస్టారర్ కి సైన్ చేయబోతున్న చరణ్,ఎన్టీఆర్..?

  • April 14, 2020 / 05:21 PM IST

ఎన్టీఆర్-చరణ్ ల భారీ మల్టీస్టారర్ ఆర్ ఆర్ ఆర్ షూటింగ్ జరుపుకుంటుంది. రాజమౌళి ఈ చిత్రాన్ని పాన్ ఇండియా మూవీగా భారీగా తెరకెక్కిస్తున్నాడు. చరణ్ అల్లూరి సీతారామ రాజు పాత్ర చేస్తుండగా, ఎన్టీఆర్ కొమురం భీమ్ పాత్ర చేస్తున్నారు. చారిత్రక పాత్రలకు ఫిక్షన్ జోడించి రాజమౌళి విజువల్ వండర్ గా ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు. ఇక ఆర్ ఆర్ ఆర్ కథలో ఎన్టీఆర్, చరణ్ కలిసి దొరలపై యుద్ధం సాగిస్తారని తెలుస్తుంది. 400 కోట్లకు పైగా బడ్జెట్ తో డి వి వి దానయ్య ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా, అజయ్ దేవ్ గణ్ ఓ కీలకపాత్ర చేస్తున్నారు.

బాలీవుడ్ బ్యూటీ అలియా భట్ చరణ్ కి హీరోయిన్ గా నటిస్తుంది. ఎన్టీఆర్ సరసన హీరోయిన్ గా బ్రిటీష్ స్టేజ్ ఆర్టిస్ట్ ఒలీవియా మోరిస్ ని తీసుకున్నారు. కాగా ఈ ఇద్దరు స్టార్ హీరోలపై ఓ ఆసక్తికర వార్త ప్రచారంలోకి వచ్చింది. ఆర్ ఆర్ ఆర్ తరువాత చరణ్, ఎన్టీఆర్ కలిసి మరో మల్టీ స్టారర్ లో కనిపించనున్నారట. దీనికి సంబంధించిన సన్నాహాలు మొదలైపోయాయట. ఇప్పటికే స్క్రిప్ట్ సిద్ధంగా ఉండగా చరణ్, ఎన్టీఆర్ సైతం సినిమాకు పచ్చ జెండా ఉపారని కథనాలు ప్రచురితం అవుతున్నాయి.

వీరు నటిస్తున్న ఆర్ ఆర్ ఆర్ పీరియాడిక్ డ్రామా కాగా ఈ చిత్రం ఇప్పటి కాలానికి చెందిన మంచి మాస్ అండ్ కమర్షియల్ సబ్జెక్టు అని సమాచారం. ఈ ఇద్దరు హీరోల ఇమేజ్ కి సరిపడేలా స్క్రిప్ట్ పక్కాగా సిద్ధం చేశారట. ఇది కూడా పాన్ ఇండియా లెవెల్ లో భారీగా విడుదల కానుందని సమాచారం. ఈ క్రేజీ ప్రాజెక్ట్ కి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలో వెలువడే అవకాశం కలదు.

Most Recommended Video

అత్యధిక టి.ఆర్.పి నమోదు చేసిన సినిమాల లిస్టు!
టాలీవుడ్ టాప్ హీరోల వరస్ట్ లుక్స్ ఇవే!
మన హీరోయిన్ల ఫ్యామిలీస్ సంబంధించి రేర్ పిక్స్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus