పూరి దర్శకత్వంలో సినిమా చేయడంపై డైలమాలో తారక్

  • October 22, 2016 / 07:20 AM IST

యంగ్ టైగర్ ఎన్టీఆర్ కథల ఎంపికలో ఆచి తూచి అడుగులు వేస్తున్నారు. ఒకే తరహా పాత్రల్లో కనిపించేందుకు ఇష్టపడడంలేదు. రిస్క్ అయిన కొత్త స్టోరీ చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు. టెంపర్ నుంచి ఈ విధానం ఫాలో అవుతున్నారు. అందుకే ఆయన జనతా గ్యారేజ్ తర్వాత ఎన్ని కథలు విన్నా ఒకే చేయలేక పోతున్నారు. పూరి జగన్నాథ్ చెప్పిన లైన్ బాగుంది కానీ సినిమా ఎలా వస్తుందోనని, అభిమానులు ఏమంటారోనని ఆలోచనలో పడ్డారు.

తన అన్నయ్య తో పూరీ తీస్తున్న ఇజం విడుదల వరకు ఆగుదాము, ఆ సినిమాకు వచ్చిన టాక్ ని బట్టి పూరి తో సినిమా చేద్దామా? వద్దా? డిసైడ్ చేద్దామనుకున్నారు. నిన్న(శుక్రవారం) కళ్యాణ్ రామ్ నటించిన ఇజం రిలీజ్ అయింది. సినిమా బాగుందని చెబుతున్నారు.. కానీ పూరీ కొత్తగా ఇందులో చూపించింది ఏమి లేదని విమర్శిస్తున్నారు. పైగా టెంపర్ లా ఉందని కొంతమంది కామెంట్ చేస్తున్నారు. దీంతో ఎన్టీఆర్ పునరాలోచనలో పడ్డారు. తనతో పూరి మళ్లీ టెంపర్ 3 ని తీస్తారేమోనని వెనకడుగు వేస్తున్నారు. మరి జగన్ ఎన్టీఆర్ అనుమానాలను ఎలా నివృత్తి చేస్తారో చూడాలి.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus