పూరి జగన్నాథ్ పై ఎన్టీఆర్ ప్రశంసల జల్లు

  • October 6, 2016 / 07:40 AM IST

సాధారణ హీరోని క్రేజీ హీరోగా చెక్కే శిల్పి పూరి జగన్నాథ్. ఎంత సాఫ్ట్ గా ఉన్న నటుడైన ఆయన  సినిమాలోకి రాగానే స్ట్రాంగ్ గా మారిపోతాడు. ఫిజికల్ గానే కాదు, మెంటల్ గా యమ స్ట్రాంగ్ అవుతాడు. అదే విషయాన్నీ యంగ్ టైగర్ ఎన్టీఆర్ అందరి ముందు చెప్పాడు. పూరి జగన్నాథ్ తనని పూర్తిగా మార్చేశారని వెల్లడించారు.

బుధవారం జరిగిన ఇజం ఆడియో వేడుకలో తారక్ మాట్లాడుతూ “నేను జగన్ గారితో టెంపర్ చేయకముందు ఒకటి.. చేసిన తర్వాత మరొకటి. నాలో ఆత్మ విశ్వాసం పెరిగిందంటే దానికి కారణం టెంపర్. ఆ కాన్ఫిడెన్స్ నాకు జగన్ భయ్యా ఇచ్చారు. ఆ సినిమా చేసిన తరువాత నాలో చాలా మార్పు వచ్చింది. ప్రతీ విషయాన్ని డిఫరెంట్ గా చూడటం నేర్చుకున్నా. అందుకే నాకు పూరి భయ్యా అంటే చాలా ఇష్టం. ఎప్పుడెప్పుడు కళ్యాణ్ రామ్ అన్న జగన్ గారితో పనిచేస్తే.. ఆయన ఒక కొత్త కోణంలో కనిపిస్తారని నాకు ఆశ ఉండేది. ఇప్పటికి ఆ ఆశ తీరింది. అన్న లుక్ అదిరిపోయింది. లుక్ అంటే కండలు కాదు. అన్న యాటిట్యుడ్ పూర్తిగా మారిపోయింది.” అంటూ జగన్ కు ఎన్టీఆర్ కృతజ్ఞతలు తెలిపారు. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో నందమూరి కళ్యాణ్ రామ్ హీరో గా నటిస్తూ నిర్మిస్తున్న ఇజం సినిమా ఈనెల 20 న రిలీజ్ కానుంది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus