ఎన్టీఆర్, బాబీ సినిమాకు ఖరారైన దేవీ శ్రీ ప్రసాద్

  • December 21, 2016 / 07:26 AM IST

యంగ్ టైగర్ ఎన్టీఆర్ వరుసగా నాలుగో విజయాన్ని అందుకోవడానికి సిద్ధమవుతున్నారు. టెంపర్, నాన్నకు ప్రేమతో, జనతా గ్యారేజ్ హ్యాట్రిక్ తర్వాత ఆయన చేయనున్న సినిమా కథ ఎంపికలో ఆలస్యం చేసినప్పటికీ వెంటనే సెట్స్ మీదకు వెళ్ళడానికి డైరక్టర్ బాబీతో కలిసి టెక్నీషియన్ల సెలక్షన్ వేగంగా పూర్తి చేశారు. ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్లో తొలిసారి తారక్ నటిస్తున్నఈ మూవీ కి తొలుత సంగీత దర్శకుడిగా అనిరుధ్ ని అనుకున్నారు. అతను ప్రస్తుతం డైరక్టర్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో రానున్న మూవీ సిట్టింగ్ లో ఉన్నారు. అతను కొంత సమయం కోరడంతో ఆ అవకాశం దేవీ శ్రీ ప్రసాద్ కి వరించింది.

గత రెండు చిత్రాలకు దేవినే పాటలు ఇచ్చారు. ముఖ్యంగా బ్యాగ్రౌండ్ స్కోర్ అదిరిపోయింది. దీంతో వరుసగా మూడో సినిమాకి ఛాన్స్ ఇచ్చారు. సంక్రాంతి నుంచి సెట్స్ మీదకు వెళ్లనున్న ఈ మూవీలో యంగ్ టైగర్ మూడు పాత్రల్లో మెప్పించనున్నారు. అందుకే ముగ్గురు హీరోయిన్లు నటించనున్నారు. వంద కోట్లతో కళ్యాణ్ రామ్ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ చిత్రం సంక్రాంతి తర్వాత రెగ్యులర్ షూటింగ్ జరుపుకోనుంది.

Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus