పూరి జగన్నాథ్ తో చిత్రం పై ఎన్టీఆర్ పునరాలోచన

  • October 24, 2016 / 11:01 AM IST

యంగ్ టైగర్ ఎన్టీఆర్ కి కొత్త చిక్కు వచ్చి పడింది. తనకి టెంపర్ వంటి హిట్ ఇచ్చి ఫుల్ ఫామ్లోకి రావడానికి కారణమయిన స్పీడ్ డైరక్టర్ పూరి జగన్నాధ్ తో సినిమాకి నో చెప్పలేక తెగ ఇబ్బంది పడిపోతున్నారు. తారక్ కి కొన్ని రోజుల క్రితం పూరి స్టోరీ చెప్పారు. అతనికి నచ్చింది కానీ, అభిమానులు ఎలా స్వీకరిస్తారోనని ఆలోచనలో పడ్డారు. అప్పుడు పూరి ఇజం షూటింగ్ లో బిజీగా ఉండేసరికి.. ఈ చిత్రం తర్వాత చూద్దాం లే అని కాసేపు పక్కన పెట్టారు. ఇజం ఆడియన్స్ కి కనెక్ట్ అయితే, అతనికి ఒకే చెబుతాము.. లేకుంటే వేరే డైరక్టర్ తో వెళుదామని అనుకున్నారు.

ఇజం విడుదల కావడం. ఓ మోస్తరు హిట్ టాక్ రావడం జరిగి పోయాయి. ఆ సినిమా కళ్యాణ్ రామ్ ఇమేజ్ ని పెంచింది కానీ, పూరి జగన్నాథ్ కి పేరు తీసుకురాలేక పోయింది. పైగా అతని గత చిత్రాల జాబితాలో ఇజాన్ని కలిపేశారు. ఈ మిశ్రమ టాక్ తో ఎన్టీఆర్ సంతృప్తిగా లేరు. జ్యోతి లక్ష్మి, లోఫర్, ఇజం చిత్రాల ద్వారా పూరి క్రేజ్ తగ్గించున్నారు. తారక్ టెంపర్, నాన్నకు ప్రేమతో, జనతా గ్యారేజ్ వంటి చిత్రాలతో ఇమేజ్ పెంచుకున్నారు. ఈ సమయంలో మొహమాటానికి పోయి పూరి కి ఒకే చెబితే ఫలితం ఎలా ఉంటుందోనని సతమవుతున్నారు. ఇజం తర్వాత ఎన్టీఆర్ పై ఒత్తిడి పెరగడంతో ఏమి చేయాలో తెలియక పునరాలోచనలో పడ్డారు. మరో వారం రోజుల్లో తారక్ తన తర్వాతి సినిమాపై నిర్ణయం తీసుకోనున్నారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus