“ఒక్క క్షణం” రిలీజ్ డేట్ ఫిక్స్!

  • November 19, 2017 / 02:25 PM IST

శ్రీర‌స్తు శుభ‌మ‌స్తు లాంటి ఫ్యామిలి ఎంట‌ర్ టైన‌ర్ త‌రువాత అల్లు శిరీష్ హీరోగా, సురభి, సీరత్ కపూర్ హీరోయిన్లుగా, శ్రీనివాస్ అవసరాల ప్రధాన పాత్రలో, ఎక్క‌డ‌కి పోతావు చిన్న‌వాడా లాంటి టెర్రిఫిక్ బ్లాక్‌బ‌స్ట‌ర్ చిత్ర ద‌ర్శ‌కుడు విఐ ఆనంద్ దర్శకత్వంలో లక్ష్మీ నరసింహ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై చక్రి చిగురుపాటి నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి ఒక్క క్ష‌ణం అనే టైటిల్ ని ఖ‌రారు చేశారు. ఇప్ప‌టికే దాదాపు షూటింగ్ పూర్త‌యిన ఈ చిత్రం డిసెంబర్ 23 న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్ చేయనున్నట్టు నిర్మాతలు ప్రకటించారు.

ఈ సందర్భంగా చిత్ర నిర్మాతలు మాట్లాడుతూ…. అల్లు శిరీష్ హీరోగా మా బ్యానర్ లో నిర్మిస్తున్న చిత్రానికి ఒక్క క్షణం అనే టైటిల్ పెట్టాం. టైటిల్ కి అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. డిసెంబర్ 23 న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ చేస్తున్నాం. శ్రీరస్తు శుభమస్తు వంటి సూపర్ హిట్ చిత్రం తర్వాత అల్లు శిరీష్ నటిస్తున్న చిత్రం కావడం, ఎక్కడికి పోతావు చిన్నవాడ వంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత విఐ ఆనంద్ దర్శకత్వం వహిస్తున్న చిత్రం కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. చాలా కొత్త చిత్రం గా అంద‌ర్ని అశ్య‌ర్యానికి గురిచేస్తుంది. ద‌ర్శ‌కుడు స్టైల్లో వుంటూ హీరో అల్లు శిరీష్ ని చాలా కొత్త‌గా మెగాఅభిమానుల్ని ఆక‌ట్టుకునేలా ఈ చిత్రం వుంటుంది. డిసెంబ‌ర్ 23న విడుద‌ల‌వుతున్న ఈ చిత్రం ఇంటెలిజెంట్ ప్రేక్ష‌కుల నుండి సామాన్య ప్రేక్ష‌కుల వ‌ర‌కూ అంద‌ర్ని ఆక‌ట్టుకుంటుంది. అల్లు శిరీష్ , సుర‌భి, అవ‌స‌రాల శ్రీనివాస్‌, సీర‌త్ క‌పూర్ లు చాలా కొత్త పాత్ర‌ల‌తో ఆక‌ట్టుకుంటారు. అబ్బూరి రవి, ఛోటా కె ప్రసాద్, శ్యామ్ కె నాయిడు వంటి సీనియర్ టెక్నీషియన్స్ ఈ చిత్రానికి వర్క్ చేస్తుండడం విశేషం. సతీష్ వేగేశ్న, రాజేష్ దండ సహనిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. అని అన్నారు.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus