Anu Emmanuel: మొత్తానికి బిజీ అయిన అను ఇమ్మాన్యుయేల్…!

  • May 29, 2021 / 05:22 PM IST

ఎంట్రీ ఇవ్వడమే పెద్ద హీరోల సరసన నటించడం.. అది కూడా స్టార్ హీరోల సరసన నటించే అవకాశం రావడం అంటే మామూలు విషయం కాదు. అందరి హీరోయిన్లకు ఇలాంటి అవకాశం దక్కదు. కానీ హీరోయిన్ అను ఇమ్మాన్యుయేల్ కు దక్కింది. నాని హీరోగా వచ్చిన ‘మజ్ను’ చిత్రంతో ఎంట్రీ ఇచ్చిన ఈ అమ్మడు అటు తర్వాత విశాల్ తో ‘డిటెక్టివ్’, గోపీచంద్ తో ‘ఆక్సిజన్’, పవన్ కళ్యాణ్ తో ‘అజ్ఞాతవాసి’, అల్లు అర్జున్ తో ‘నా పేరు సూర్య’, నాగ చైతన్యతో ‘శైలజారెడ్డి అల్లుడు’ వంటి చిత్రాల్లో నటించే అవకాశాన్ని దక్కించుకుంది.

కానీ ఆ సినిమాలు ఆశించిన స్థాయిలో విజయం సాధించకపోవడంతో.. ఈ అమ్మడి పై ఐరన్ లెగ్ అనే ముద్ర పడింది. దాంతో చాలాకాలం ఈమెకు అవకాశాలు కరువయ్యాయి. అయితేనేం ఎట్టకేలకు ఈ అమ్మడు మళ్ళీ సినిమాలతో బిజీ అయ్యింది. ఈ ఏడాది బెల్లంకొండ సాయి శ్రీనివాస్ తో ‘అల్లుడు అదుర్స్’ అనే చిత్రంలో నటించింది. ప్రస్తుతం అల్లు శిరీష్ హీరోగా తెరకెక్కుతున్న చిత్రంలో హీరోయిన్ గా నటిస్తుంది.ఈ చిత్రంలో ఇంటిమేట్ రొమాంటిక్ సీన్స్ లో నటించి రచ్చ లేపుతుందని అను అని వినికిడి.

ఇటీవల ఈ చిత్రానికి సంబంధించి విడుదల చేసిన పోస్టర్లను బట్టి ఆ విషయం నిజమే అనిపిస్తుంది. ‘గీతా ఆర్ట్స్’ వంటి బడా సంస్థ కాబట్టి.. ఈ చిత్రం మినిమమ్ గ్యారంటీ అనే చెప్పాలి. ఇక దీంతో పాటు శర్వానంద్ హీరోగా నటిస్తున్న ‘మహాసముద్రం’ చిత్రంలో కూడా ఈ అమ్మడు నటిస్తుంది. ఇందులో కూడా ఈమెది కీలక పాత్రట. పెద్ద హీరోల సినిమాల్లో అవకాశాలు రాకపోయినా.. ఇలా చిన్న హీరోల సరసన నటిస్తూ బిజీగా గడుపుతుంది ఈ అమ్మడు.

Most Recommended Video

ఏక్ మినీ కథ సినిమా రివ్యూ & రేటింగ్!
2 ఏళ్ళుగా ఈ 10 మంది డైరెక్టర్ల నుండీ సినిమాలు రాలేదట..!
టాలీవుడ్లో రూపొందుతున్న 10 సీక్వెల్స్ లిస్ట్..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus