సూపర్ స్టార్ ని డైరక్ట్ చేయనున్న మాట్లా మాంత్రికుడు

  • September 29, 2016 / 06:08 AM IST

సూపర్ స్టార్ మహేష్ బాబు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ మళ్లీ కలవనున్నారు. వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన అతడు సూపర్ హిట్ అందుకుంది. ఆ తర్వాత వీరి కలయికలో ఖలేజా సినిమా రూపుదిద్దుకుంది. అయితే ఈ చిత్రం అంచనాలను అందుకోలేదు. కానీ ఇందులో మహేష్ కామెడీ టైమింగ్ ని త్రివిక్రమ్ కొత్తగా ఆవిష్కరించారు. మళ్లీ అనేక ఏళ్ల తర్వాత త్రివిక్రమ్ దర్శకత్వంలో ప్రిన్స్ నటించనున్నారు.

సినిమా కోసం అనుకుంటే పొరబాటే.. వాణిజ్య ప్రకనటన కోసం కలిసి పని చేయనున్నారు. గతంలో మహేష్ కనిపించిన మహీంద్రా ట్రాక్టర్స్, జొస్ అలుక్కాస్ కంపెనీల యాడ్ లకు మాటల మాంత్రికుడు డైరక్షన్ చేసాడు. ఇప్పుడు మరో కంపెనీ కోసం యాడ్ ఫిలిం షూట్ చేయనున్నారు. ప్రస్తుతం మురుగదాస్ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం షూటింగ్ లో బిజీగా ఉన్న సూపర్ స్టార్ త్వరలో వాణిజ్య ప్రకటనలో నటించనున్నారు.  అభిమానులు మాత్రం వీరిద్దరి కాంబినేషన్లో సినిమా ఎప్పుడు వస్తుందా ? అని ఎదురు చూస్తున్నారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus