మరోసారి బాలీవుడ్ కి ఎంట్రీ ఇవ్వబోతున్న పూజా హెగ్దే..!

  • April 1, 2019 / 07:27 PM IST

‘ఒక లైలా కోసం’ చిత్రంతో టాలీవుడ్ కి పరిచయమైంది పూజా హెగ్దే. తొలి చిత్రమే ‘అన్నపూర్ణ స్టూడియోస్’ వంటి పెద్ద బ్యానర్లో చేయడంతో ఆమెకు బాలీవుడ్లో హృతిక్ రోషన్ సరసన ‘మొహంజొదారో’ వంటి పెద్ద చిత్రంలో ఛాన్సొచ్చింది. అయితే ఆ చిత్రం భారీగా డిజాస్టర్ కావడంతో పూజాకి అక్కడ అవకాశాలేమీ రాలేదు. దీంతో మళ్ళీ టాలీవుడ్ కి తిరిగొచ్చేసి… అల్లుఅర్జున్ తో ‘దువ్వాడ జగన్నాథం’ చిత్రం చేసింది. బాలీవుడ్ కి వెళ్ళి గ్లామర్ షో చేయడం బాగా అలవాటు చేసుకుందేమో… ఈ చిత్రంలో ఓ రేంజ్లో అందాల ఆరబోత పోసి బడా దర్శక నిర్మాతల్ని, స్టార్ హీరోలని ఆకర్షించింది.

ఎన్టీఆర్,మహేశ్ బాబు,ప్రభాస్ వంటి స్టార్ హీరోలందరి సరసన నటించే అవకాశం దక్కించుకుంది. ఇప్పుడు టాలీవుడ్లో మళ్ళీ పూజా హవా మొదలవ్వడం బాలీవుడ్ ఇండస్ట్రీ గమనించినట్టుంది. ‘హౌస్ ఫుల్ 4’లో పూజాకి అవకాశం వచ్చింది. ఈ చిత్రానికి నిర్మాతగా వ్యవహరిస్తోన్న సాజిద్ నడియాడ్ వాలాకి పూజ నటన విపరీతంగా నచ్చేసిందట. దీంతో తన బ్యానర్లో చేయబోయే మరో రెండు చిత్రాల్లోనూ పూజా ని హీరోయిన్ గా ఎంచుకున్నాడట. ఈ రెండు చిత్రాలు హిట్టయితే ఇక పూజా బాలీవుడ్లో దూసుకెళ్ళడం ఖాయం అని చెప్పడంలో సందేహం లేదు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus