తెరపైకి మరోసారి సుప్రీమ్ కాంబో

  • January 23, 2021 / 11:12 AM IST

మెగా హీరో సాయి ధరమ్ తేజ్ లాక్ డౌన్ తరువాత అందరికంటే ముందు థియేటర్స్ లోకి వచ్చిన విషయం తెలిసిందే. రొమాంటిక్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన సోలో బ్రతుకే సో బెటర్ సినిమా కరోనా కష్ట కాలంలో వసూళ్లను బాగానే అందుకుంది. భవిష్యత్తు సినిమాలకు ఒక నమ్మకాన్ని కూడా ఇచ్చింది. అయితే ఆ సినిమా అనంతరం సాయి మరో రెండు సినిమాలను లైన్ లో పెట్టాడు. దేవకట్టా దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్న విషయం తెలిసిందే.

అలాగే సుకుమార్ బ్యానర్ లో కూడా ఒక బ్లాక్ మ్యాజిక్ బ్యాక్ డ్రాప్ లో డిఫరెంట్ సినిమా చేస్తున్నాడు. ఇక ఆ సినిమాలో సుప్రీమ్ హీరోయిన్ రాశి ఖన్నా నటించనున్నట్లు తెలుస్తోంది. ఇటీవల చేతికొచ్చిన ఆఫర్స్ ను కూడా బ్యాడ్ లక్ తో చేజార్చుకుంటున్న ఈ బ్యూటీ మొత్తానికి మంచి ఆఫర్ అందుకున్నట్లు టాక్ వస్తోంది. రాశి చివరగా విజయ్ దేవరకొండతో వరల్డ్ ఫేమస్ లవర్ సినిమా చేసిన విషయం తెలిసిందే. ఆ సినిమా తరువాత రాశి ట్రోలింగ్స్ గట్టిగానే ఎదుర్కొంది.

ఇక రీసెంట్ గా గోపిచంద్ చేయబోయే ఒక సినిమా అవకాశం అందుకున్నట్లే అందుకొని చర్చల అనంతరం చేజార్చుకున్నట్లు సమాచారం. ఇక ఆ రూమర్స్ ఎంతవరకు నిజమో తెలియదు గాని మొత్తానికి సుకుమార్ ప్రొడక్షన్ లో సాయి ధరమ్ తేజ్ చేయబోయే సినిమాలో మంచి ఛాన్స్ అందుకున్నట్లు తెలుస్తోంది. ఇక ప్రస్తుతం తమిళ్ లో మాత్రం ఈ బబ్లీ గర్ల్ నాలుగు సినిమాల్లో నటిస్తోంది.

Most Recommended Video

మాస్టర్ సినిమా రివ్యూ& రేటింగ్!
రెడ్ సినిమా రివ్యూ & రేటింగ్!
క్రాక్ సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus