‘అయ్యప్పనుమ్ కోషియమ్’ రీమేక్.. రానా సైలెన్స్ కు కారణం అదే..!

  • October 31, 2020 / 06:02 AM IST

దసరా పండుగ సందర్భంగా పవన్ కళ్యాణ్ కొత్త సినిమాకి సంబంధించిన ప్రకటన వచ్చిన సంగతి తెలిసిందే. మలయాళంలో సూపర్ హిట్ అయిన ‘అయ్యప్పనుమ్ కోషియమ్’ రీమేక్ లో పవన్ కళ్యాణ్ నటించబోతున్నట్టు అధికారిక ప్రకటన వచ్చింది. ‘అప్పట్లో ఒకడుండేవాడు’ ఫేమ్ సాగర్.కె.చంద్ర డైరెక్ట్ చెయ్యనున్న ఈ చిత్రాన్ని ‘సితార ఎంటర్టైన్మెంట్స్’ బ్యానర్ పై సూర్యదేవర నాగవంశీ నిర్మించనున్నాడు. ఒరిజినల్ లో బిజూ మీనన్ పోషించిన పోలీస్ ఆఫీసర్ పాత్రని ఇక్కడ పవన్ కళ్యాణ్ పోషించనున్నాడు.

అయితే పృథ్వీరాజ్ సుకుమారన్ పాత్రని ఎవరు పోషిస్తారు అనేది ఇప్పుడు పెద్ద చర్చకు దారి తీసింది. మొదట రానా ఈ పాత్రకు ఫిక్స్ అని టాక్ బలంగా వినిపించింది. మొదటి నుండీ ఇది పవన్ – రానా మల్టీ స్టారర్ అన్నట్టే ప్రచారం జరిగింది. కానీ ఇప్పుడు ఈ ప్రాజెక్టు నుండీ రానా తప్పుకున్నాడని ఇన్సైడ్ టాక్. తన ప్రాజెక్టులతో బిజీగా ఉండడం వల్లనే.. ఈ రీమేక్ లో రానా నటించే అవకాశాలు లేవని ప్రచారం మొదలైంది.

నితిన్ లేదా కిచ్చ సుదీప్ వంటి వారు ఈ పాత్ర చేసే అవకాశాలు ఉన్నాయని కూడా ప్రచారం జరుగుతుంది. ఇటీవల సుదీప్.. పవన్ కళ్యాణ్ ను కలిసిన సంగతి తెలిసిందే. ఈ విషయం మీదే ఆయన పవన్ ను కలిసి ఉండొచ్చనే టాక్ కూడా మొదలైంది. మరి అసలు మ్యాటర్ ఏంటో నిర్మాతలు ప్రకటిస్తే కానీ ఓ క్లారిటీ వచ్చే అవకాశం అయితే లేదు.

Most Recommended Video

‘ఆర్.ఆర్.ఆర్’ : భీమ్ పాత్రకు రాజమౌళి ఆ పాయింటునే తీసుకున్నాడా?
‘బిగ్ బాస్’ అఖిల్ గురించి మనకు తెలియని విషయాలు..!
టాలీవుడ్లో 30 కోట్ల మార్కెట్ కలిగిన హీరోలు ఎవరో తెలుసా?

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus