సైన్ చేసిన రెండు చిత్రాలను ఆపేయాలని చూస్తున్న పవన్ ?

  • August 2, 2017 / 05:54 AM IST

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇబ్బందుల్లో ఉన్నారు. ఒప్పుకున్న సినిమాలను పూర్తి చేసి ప్రజల్లోకి వెళ్లాలా? .. ఎన్నికల తర్వాత సినిమాలు చేయాలా ? అనే సందిగ్ధంలో ఉన్నారు. ప్రస్తుతం మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో పవన్ సినిమా చేస్తున్నారు. ఈ చిత్రాన్ని సెప్టెంబర్ నాటికీ కంప్లీట్ చేసి అక్టోబర్ లో రిలీజ్ చేయాలనీ అనుకున్నారు. కానీ అనుకోని సమావేశాల కారణంగా షూటింగ్ అక్టోబర్ వరకు కొనసాగే పరిస్థితి నెలకొని ఉంది. కాబట్టి పవన్ 25 వ సినిమా సంక్రాంతికి రిలీజ్ చేసేలా డిసైడ్ అయ్యారు. ఇది ఒకే.. దీని తర్వాత చకచకా సినిమాలు చేసేయాలని రెండింటికి సైన్ చేశారు.

మైత్రీ మూవీ బ్యానర్ లో సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఓ సినిమా, ఎ.ఎం రత్నం సమర్పణలో నేసన్ దర్శకత్వంలో మరో సినిమా అంగీకరించారు. ప్రస్తుతం చేస్తున్న సినిమానే వేగంగా కంప్లీట్ కాలేదు. మరి ఆ రెండింటి పరిస్థితి ఏంటని పవన్ ఆలోచనలో పడ్డట్టు తెలిసింది. పైగా ఇతర రాజకీయ పార్టీలు ఎన్నికలకు సన్నద్ధం అవుతున్నాయి. జనసేన పార్టీని బలోపేతం చేయాల్సిన అవసరం కూడా ఉంది. ఈ కారణాల వల్ల ఆ రెండు చిత్రాలను నిలిపేస్తే మంచిదని నిర్మాతలతో పవన్ చర్చిస్తున్నట్లు సమాచారం.  మరి తుది నిర్ణయం ఏమి తీసుకుంటారో చూడాలి.


Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus